Alitho saradaga actor Sriram: 'స్నేహితుడు', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తదితర సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా దర్శకుడు పూరీజగన్నాథ్ తెరకెక్కించిన ఓ సూపర్హిట్ చిత్రంలో హీరోగా తాను నటించాల్సిందని, కానీ తనకు జరిగిన ఓ ప్రమాదం వల్ల అది మిస్ అయిందని గుర్తుచేసుకున్నారు.
"కేఎల్ ఎన్ రాజుతో 'అమ్మనాన్న తమిళ అమ్మాయి' సినిమా చేయాలి. కోనా వెంకట్ రచయిత. పూరీ జగన్నాథ్ దర్శకుడు. ప్రెస్మీట్ పెట్టి నన్ను హీరోగా ప్రకటించారు. కానీ నాకు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల స్టంట్స్ చేసే పరిస్థితుల్లో నేను లేను. అప్పటికే కాలిపోయిన శరీరంపై కొత్త చర్మం అంటించారు. కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుంది. కానీ పూరీ గొప్ప వ్యక్తి. ఫైట్స్ తగ్గిస్తాను మూవీ చేద్దాం అన్నారు. అలా ఆయన చెప్పడం నాకు సంతోషమేసింది. కానీ.. 'నేను చేయను, ఎందుకంటే అలా చేస్తే సినిమాకు ప్రాణం పోతుంది' అని అన్నాను. ఓ స్టూడియోకు వేళ్తే అక్కడ రవితేజ ఉన్నారు. 'ఎందుకు మంచి సినిమాను వదులుకుంటున్నావు' అని అన్నారు. లేదు ఇప్పుడున్న పరిస్థితిలో నేను చేయలేనను మళ్లీ చెప్పాను. కానీ దాన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ ఏదోలా ఉంటుంది. ఆ తర్వాత పూరీతో సినిమా చేద్దామనుకున్నాను. ఆయన తెరకెక్కించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' అంటే ఇష్టం. అది చేయాలనిపించింది. కానీ కుదరలేదు."
-శ్రీరామ్, నటుడు.
ఫైర్ యాక్సిడెంట్ అలా జరిగింది..