తెలంగాణ

telangana

కమలా హారిస్ కుటుంబంపై కరోనా ప్రభావం

By

Published : May 7, 2021, 6:27 PM IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మామ జీ బాలచంద్రన్​ 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏటా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుక చేసుకునే ఆయన.. ఈసారి కరోనా వల్ల వాటికి దూరంగా ఉన్నారు. అయితే కమల సహా బంధువులందరూ ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారని ఓ ఇంటర్వ్యూలో బాలచంద్రన్​ తెలిపారు.
US Vice President Kamala Harris' family
కమల మామ

కరోనా ప్రభావం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కుటుంబంపైనా పడింది. దిల్లీలో నివాసముండే ఆమె మామ జీ బాలచంద్రన్​ ఇటీవలే 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏటా కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుక చేసుకునే ఆయన.. దేశంలో కరోనా పరిస్థితి దృష్ట్యా ఈసారి అలా జరుపుకోలేక పోయారు. అయితే కమలా హారిస్ సహా బంధుమిత్రులంతా తనకు ఫోన్ చేసి బర్త్​డే విషెస్​ చెప్పారని ఓ ఇంటర్వ్యూలో బాలచంద్రన్​ వెల్లడించారు.

కమల మామ

కమలా హారిస్, ఆమె భర్త డౌగ్​ ఎమ్​హోఫ్​తో ఫోన్​లో చాలాసేపు సంభాషించినట్లు బాలచంద్రన్​ వివరించారు. అమెరికాలో ఉన్న తన కూతురు బాగోగులను చూసుకుంటానని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కమల భరోసా ఇచ్చినట్లు చెప్పారు. మార్చి తర్వాత మళ్లీ ఆమెతో మాట్లాడలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి భారత్​లో కరోనా ఉగ్రరూపం దాల్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తుచేశారు.

బాలచంద్రన్ పదవీ విరమణ అనంతరం దిల్లీలోని తన నివాసంలోనే ఉంటున్నారు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి మాత్రమే అప్పడప్పుడూ బయటకు వెళ్తారు. అయితే తాను అదృష్టవంతుడినని చెబుతున్నారు. తనను కలిసే వారు ఎవరూ లేనందున స్వయంకృపరాధంతో తప్పితే ఇతరుల వల్ల కరోనా సోకే అవకాశం తనకు లేదని పేర్కొన్నారు. తన సోదరి సరళ కూడా చెన్నైలోని అపార్ట్​మెంట్​లో ఐసోలేషన్​లోనే ఉంటున్నారని వివరించారు. ఇద్దరూ కరోనా టీకా తీసుకున్నట్లు వెల్లడించారు.

భారత్​కు అండగా...

భారత్​లో కరోనా సంక్షోభం కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు దౌత్యపరమైన, మానవతా సవాళ్లు ఎదురయ్యాయి. అయితే కమలా హారిస్​కు ఇది వ్యక్తిగత విషయం కూడా. ఆమె తల్లి భారత్​లోనే జన్మించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ తన చిన్నతనంలో భారత్​ను పలుమార్లు సందర్శించడం తనపై చాలా ప్రభావం చూపిందని అనేక మార్లు చెప్పారు.

భారత్​లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో మద్దతు ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు బైడెన్ ప్రభుత్వాన్ని పదే పదే కోరారు. తొలుత టీకా ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధం విధించిన అగ్రరాజ్యం.. భారత్​కు సాయం చేయాలని చట్టసభ్యులు ఒత్తిడి చేసినందున ఆ తర్వాత దాన్ని ఎత్తివేసింది. వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ చూడండి:'కమలం' విరిసింది.. తులసేంద్రపురం మురిసింది!

ABOUT THE AUTHOR

...view details