తెలంగాణ

telangana

TTD Chairman Bhumana Karunakar Reddy comments శ్రీవారి భక్తుల రక్షణ కోసం..టీటీడీ కీలక నిర్ణయాలు

By

Published : Aug 14, 2023, 6:17 PM IST

Updated : Aug 15, 2023, 6:57 AM IST

TTD Chairman Bhumana Karunakar Reddy comments: తిరుమల శ్రీవారి భక్తులకు, దుకాణాల యజమానులకు, వన్యప్రాణులకు ఆహారం ఇచ్చేవారికి తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇక నుంచి 12 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

TTD_Chairman_comments_2023
TTD_Chairman_comments_2023

TTD Chairman Bhumana Karunakar Reddy comments: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. భక్తులకు, దుకాణాల యజమానులకు, వన్యప్రాణులకు ఆహారం ఇచ్చేవారికి పలు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా అలిపిరి కాలినడక మార్గంలో జరిగిన చిరుత దాడిని దృష్టిలో ఉంచుకుని.. భక్తుల ప్రాణ రక్షణం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామన్న భూమన.. ఇక నుంచి కనుమ రహదారుల్లో జంతువులకు ఆహారం పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మెట్ల మార్గంలో చెత్త వేసే దుకాణాల యాజమానులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా, ప్రతి 30 మీటర్ల దూరానికి వెలుతురు కనపడేలా మెట్ల మార్గంలో ఫోకస్‌ లైట్లతో పాటు 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని..ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు.

శ్రీవారి భక్తుల రక్షణ కోసం.. కీలక నిర్ణయాలు!: టీటీడీ ఛైర్మన్

Girl killed in Leopard Attack: తిరుమల నడకదారిలో తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న చిరుత

12 years old children are allowed from 5 am to 2 pm: ''మెట్ల మార్గంలో కంచె (ఫెన్సింగ్‌) ఏర్పాటుకుతితిదే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటవీశాఖకు ప్రతిపాదనలు పెట్టాము. అయితే, ఏం చేయాలన్నా అటవీశాఖ ఆంక్షలు కఠినంగా ఉన్నాయి. అలాగే, మెట్ల మార్గంలో వచ్చే భక్తులను అప్రమత్తం చేయనున్నాం. దారిపొడవునా సూచిక బోర్డులు, లఘుచిత్రాలు ప్రదర్శించనున్నాం. ఇకపై 12 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తాం. పెద్దలకయితే రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తాం. అటవీశాఖలో సిబ్బంది నియామకానికి అవసరమైన నిధులను తితిదే సమకూరుస్తుంది. దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులను కాలినడక మార్గంతో పాటు ఏ దారిలో వచ్చినా అనుమతిస్తాం.'' అని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

TTD Restrictions to Piligrims: శ్రీవారి భక్తులను కలవరపెడుతున్న టీటీడీ ఆంక్షలు.. ఆ సమయంలో వారికి నో ఎంట్రీ

Forest Department Officer Shantipriya Pandey comments:తిరుమల నడకదారిలో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయనున్నామని.. అటవీ శాఖ అదనపు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శాంతిప్రియ పాండే మీడియాకు తెలిపారు. ఇవాళ పట్టుబడిన చిరుత డీఎన్‌ఏ, రక్తం, వెంట్రుకలు నమూనా సేకరించినట్లు ఆమె వెల్లడించారు. చిరుతపులి నమూనా ద్వారా అది మనిషిని తిన్నదా..? లేదా..? అని త్వరలోనే నిర్ధారించి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు చిరుత నమూనాలను ఐసర్‌కు పంపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. తిరుమల నడకదారిలో కంచె ఏర్పాటు చేయటం కుదరదన్న శాంతిప్రియ పాండే.. దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. ఎందుకంటే చిరుత చెట్లను, కంచెను సులువుగా దాటగలదని అన్నారు. ఈరోజు ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె తెలియజేశారు.

TTD EO Inspection: అలిపిరి నడక మార్గంలో జాగ్రత్త.. భక్తులకు టీటీడీ సూచనలు

Last Updated :Aug 15, 2023, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details