తెలంగాణ

telangana

ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం... అసలు ఏమైందంటే?

By

Published : Jul 9, 2022, 1:38 PM IST

Updated : Jul 9, 2022, 3:11 PM IST

తల్లి శవాన్ని ఇంట్లో ఉంచుకుని పెళ్లి చేసుకున్నాడు ఓ కుమారుడు. తన తల్లి ఆఖరి కోరిక తీర్చడం కోసమే ఇలా చేశానని అంటున్నాడు. ఇంతకీ ఈ కథెంటో.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..

Son married in temple by keeping mother dead body
తల్లి మృతదేహం వద్ద ఆశీస్సులు తీసుకుంటున్న కుమారుడు, కోడలు

ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం

తల్లి మృతదేహాన్ని ఇంట్లో ఉంచి కుమారుడు పెళ్లి చేసుకున్న ఘటన ఝూర్ఖండ్​లో జరిగింది. జూలై 10న కుమారుడి వివాహం జరగాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారమే మరణించింది. మృతురాలి చివరి కోరిక తన కుమారుడి పెళ్లి చేయడమే. ఈ నేపథ్యంలో తల్లి ఆఖరి కోరికను తీర్చేందుకు ఓం కుమార్ సిద్ధమయ్యాడు. శివాలయంలో సరోజ్​ను పెళ్లి చేసుకుని వచ్చి తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఈ ఘటన ధన్​బాద్​లోని కేందుఆడియా పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

తల్లి మృతదేహం వద్ద ఆశీస్సులు తీసుకుంటున్న కుమారుడు, కోడలు

ఓం కుమార్​కు, సరోజ్​ అనే యువతితో కొన్ని రోజులు క్రితమే వివాహం కుదిరింది. వీరి పెళ్లి జూలై 10న చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఓం కుమార్ తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆరోగ్యం విషమించడం వల్ల గురువారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు ఓం కుమార్. మృతదేహాన్ని ఇంట్లో ఉంచి ఓం కుమార్​ సమీపంలోని శివాలయంలో సరోజ్​ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఓం కుమార్​ తన భార్య సరోజ్​తో కలిసి ఇంటికి వచ్చాడు. తల్లి కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు.

ఇవీ చదవండి:దూసుకెళ్లిన టమాటాల ట్రక్​.. ఇంటి బయట నిద్రిస్తున్న ఆరుగురు మృతి

Last Updated :Jul 9, 2022, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details