తెలంగాణ

telangana

అమ్మ, నానమ్మ కర్కశం.. బాలిక నోట్లో మట్టి నింపి.. శ్మశానంలో పాతిపెట్టి..

By

Published : Jul 12, 2022, 9:03 AM IST

Updated : Jul 12, 2022, 11:38 AM IST

బిహార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల బాలికను.. ఆమె తల్లి, నాయనమ్మ కలిసి శ్మశానంలో పాతిపెట్టారు. బాలిక ఏడుపు విన్న స్థానికులు ఆమెను రక్షించి.. పోలీసులకు సమాచారం అందించారు.

Mother And Grandmother Buried 3 Years Girl
మూడేళ్ల బాలికను భూమిలో పాతిపెట్టిన కిరాతకులు

బిహార్​.. సారన్​లో అమానవీయ ఘటన జరిగింది. మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ కలిసి స్మశానంలో పాతిపెట్టారు. బాలిక ఏడుపు విన్న స్థానికులు వచ్చి ఆమెను కాపాడారు. ఈ దారుణం కోపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బాధితురాలు లాలీ
అసలేమైందంటే..మర్హా నది ఒడ్డున ఉన్న స్మశానవాటికలో మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ పాతిపెట్టేశారు. బాధితురాలి ఏడుపులు విన్న మహిళలు దెయ్యం అని భయపడ్డారు. అనంతరం స్థానికులు అక్కడ గుమిగూడారు. మట్టిని తొలగించి చూడగా.. బాలిక బతికే ఉంది. వెంటనే కోపా పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలికి ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులకు బాధితురాలు తన పేరు లాలీ అని చెప్పింది. తన తండ్రి పేరు రాజు శర్మ, తల్లి పేరు రేఖా దేవీ అని వెల్లడించింది. ఊరు పేరు చెప్పలేకపోయింది. బాలిక కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నామని కోపా పోలీసులు తెలిపారు. 'అమ్మ, నానమ్మ బయటకు వెళ్దాం అని తీసుకెళ్లారు. అనంతరం నన్ను స్మశానం వద్దకు తీసుకెళ్లి నోటిలో మట్టిని నింపి పాతిపెట్టారు' అని బాధితురాలు లాలీ తెలిపింది.

Last Updated :Jul 12, 2022, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details