Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 145 రోజుల తర్వాత కేసులు 20వేల మార్కును దాటాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 20,139మంది వైరస్ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 16,482 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 5.1 శాతంగా ఉంది.
- మొత్తం మరణాలు: 5,25,557
- యాక్టివ్ కేసులు: 1,36,076
- కోలుకున్నవారి సంఖ్య: 4,30,28,356