టూల్కిట్ కేసులో బెంగళూరుకు చెందిన దిశ రవి అనే 21 ఏళ్ల పర్యావరణ కార్యకర్తను దిల్లీ సైబర్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు రూపొందించిన టూల్కిట్ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకుగానూ దిశ రవిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి:గ్రెటా 'నిరసనల కుట్ర'పై దిల్లీ పోలీసుల కేసు
ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారిలో దిశ రవి కూడా ఉన్నారు. స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ సహా పలువురు ప్రముఖులు షేర్ చేయగా టూల్కిట్ వెలుగులోకి వచ్చింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఉన్న మార్గాలను సూచిస్తూ గూగుల్ డాక్యుమెంట్ సృష్టించారు. దానికి టూల్కిట్గా నామకరణం చేశారు.