EWS reservation criteria review: ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు ఉన్న రూ.8 లక్షల ఆదాయ పరిమితిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండేను కమిటీ అధిపతిగా నియమించింది. మూడు వారాల్లోగా నివేదిక అందించాలని కమిటీకి సూచించింది.
ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిపై పునరాలోచిస్తామని కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షల విషయంలో సుప్రీంలో నమోదైన కేసుపై విచారణలో భాగంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్ను వాయిదా వేసింది.