భాజపా, ఆరెస్సెస్లతో (RSS BJP news) దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ (Rakesh Tikait news today) హెచ్చరించారు. ప్రజలను, వారి మధ్య ఐక్యతను విడదీసేందుకు వారు ఎంత దూరమైనా వెళ్తారని ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం (Farmers Protest news) ప్రారంభించి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో మాట్లాడిన ఆయన (Rakesh Tikait latest news).. కేంద్రం చర్చలకు వస్తే మంచిదని అన్నారు. లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని టికాయిత్ (BKU Tikait) స్పష్టం చేశారు.
"ప్రభుత్వం మాతో ఎందుకు చర్చలు జరపడం లేదు? దాదాపు ఏడాది కావొస్తోంది. ఇంత సుదీర్ఘంగా ఏ నిరసనలైనా జరగడం చూశారా? ఈ నిరసనలను ఎంత కాలం కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటోంది? చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఓ నిర్ణయానికి రండి."