తెలంగాణ

telangana

నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు దుర్మరణం

By

Published : Jun 5, 2022, 3:03 PM IST

Updated : Jun 5, 2022, 8:34 PM IST

drown in river: నదిలో మునిగి, ఏడుగురు చనిపోయిన హృదయవిదారక ఘటన తమిళనాడులోని కడలూరులో జరిగింది. స్నానానికి నదిలో దిగిన ఓ యువతి, ఆరుగురు బాలికలు మరణించారు.

drown in river
drown in river

drown in river: తమిళనాడు కడలూరులో హృదయవిదారక ఘటన జరిగింది. నెల్లికుప్పం అరుంగుణం సమీపంలోని కెడిలం నదిలో ఏడుగురు మృతిచెందారు. ఓ యువతి, ఆరుగురు బాలికలు కలిసి స్నానానికి నదిలోకి దిగారు. లోతైన ప్రదేశానికి వెళ్లడం వల్ల ఏడుగురు గల్లంతయ్యారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టగా ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతులను నవనీత(19), సుముత(16), ప్రియ(17), మోనికా(15), సంగీత(17), ప్రియదర్శిని(14), కావ్య(12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

ఇదీ చదవండి:రూ.50వేలకు ఎముక.. లక్షన్నరకు అస్థికలు.. శ్మశానంలో 'క్షుద్ర' దందా!

Last Updated :Jun 5, 2022, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details