Traffic Diversions for Congress Chevella Meeting : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రేపు జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. ఈ సభా వేదికగా మరో రెండు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో, రద్దీని నియంత్రించటానికి పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు పూనుకుంది.
ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు - వర్చువల్గా 2 పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు
కాగా మంగళవారం రోజు సాయంత్రం బహిరంగ సభ దృష్ట్యా, మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి, సాధారణ ప్రజలు దారి మళ్లింపులను తీసుకోవాలని, ట్రాఫిక్ ఉచిత ప్రవాహాన్ని నివారించడంలో ట్రాఫిక్ పోలీసులకు(Traffic Police) సహకరించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ సూచించారు. సైబరాబాద్ చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవెళ్లలోని ఫరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. సాధారణ ప్రజల సౌకర్యార్థం పలు ట్రాఫిక్ సలహాలను పోలీస్ శాఖ జారీ చేసింది.
రాజేంద్రనగర్ ట్రాఫిక్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు : తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ(Police Academy) నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ను హిమాయత్నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ప్రగతి రిసార్ట్స్, యెంకేపల్లి ఎక్స్ రోడ్డు, ఆలూర్ ఎక్స్ రోడ్డు, వికారాబాద్ వైపు మళ్లించనున్నారు.