ETV Bharat / state

హైదరాబాద్‌లో పై వంతెనలు, అండర్‌ పాస్‌లు.. సీఎం రేవంత్‌ ఆదేశాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 1:48 PM IST

CM Revanth On Hyderabad Traffic : గ్రేటర్ హైదరాబాద్​లో ట్రాఫిక్ నిర్వహణ కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం మూడు నెలల్లో హోంగార్డులను నియమించాలన్నారు.

Government Focus on Traffic Issues in Hyderabad
CM Revanth Reddy Review Meeting on Traffic In Hyderabad

CM Revanth On Hyderabad Traffic : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్​లో ట్రాఫిక్​ సమస్యపై పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు మూడు నెలల్లో హోంగార్డులను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇతర విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెనక్కి పిలిపించి ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ నియంత్రణ విధులకు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ స్థాయిని అప్​గ్రేడ్ చేసి తగిన సంఖ్యలో సిబ్బంది ఉండేలా పునర్వ్యవస్థీకరించాలని తెలిపారు. పెరుగుతున్న జనాభా వాహనాల వినియోగం దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలపై చర్యలు చేపట్టాలన్నారు.

వాహనాల పెండింగ్‌ చలాన్ల గడువు మరోసారి పొడిగింపు - ఎప్పటివరకంటే

సిటీలో రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో ఎల్బీనగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థపైనే ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది (Hyderabad Traffic Problems) కూడా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

Government Focus on Traffic Issues in Hyderabad : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నెలకొకసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను సమీక్షించాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

స్వామీ! ఈ పార్కింగ్‌ సమస్య తీరెదెప్పుడు - ట్రాఫిక్‌తో చస్తున్నాం

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి కన్సల్టెన్సీ అధ్యయనం చేయించాలని ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari) , డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు , జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

వాహనదారులకు అలర్ట్ - మరో 4 రోజులే ట్రాఫిక్ చలాన్ల రాయితీ ఆఫర్

ఫైన్​లైనా కడతాం కానీ రూల్స్​ పాటించం - గంటకు 1,731 ట్రాఫిక్​ ఉల్లంఘనల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.