ETV Bharat / state

రూ.500కే గ్యాస్​ సిలిండర్​పై క్లారిటీ వచ్చేసింది​ - ముందుగా మొత్తం ధర చెల్లించాలి, ఆ తర్వాత!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 7:26 AM IST

Updated : Feb 26, 2024, 7:52 AM IST

Gas Cylinder Scheme in Telangana : రేపు ప్రారంభించనున్న రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌పై పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. వినియోగదారుడు ముందు మొత్తం ధర చెల్లించాలన్న అధికారులు, ఆ తర్వాత సిలిండర్‌పై రూ.500 పోనూ మిగతా మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు మహాలక్ష్మీ లబ్ధిదారుల జాబితాను నేడు ఆయిల్‌ కంపెనీలకు అధికారులు అందించునున్నారు.

Congress Gas Cylinder Concession
Gas Cylinder Concession

రూ.500 వంటగ్యాస్‌ సిలిండర్‌పై రేపు స్పష్టత - ముందు వినియోగదారులు మొత్తం చెల్లించాలన్న అధికారులు

Gas Cylinder Scheme in Telangana : కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించినందున సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారినీ మహాలక్ష్మి పథకం కిందికు తీసుకువస్తున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్‌ చేసేందుకు రెడీ అవుతుంది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.955 ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్రం రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ను రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని సమాచారం.

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - లబ్ధిదారుల ఖాతాలోకి రాయితీ నగదు బదిలీనే

Congress Gas Cylinder Discount Scheme : ‘ఉజ్వల’ రాయితీ(Ujjwala discount) పోనూ మిగతా మొత్తం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో చోట ఒక్కో ధర ఉంది. రవాణా ఛార్జీల వ్యత్యాసమే అందుకు కారణం. రాష్ట్రంలో 11 లక్షల 58 వేల ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వారికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ వస్తోంది. మహాలక్ష్మిలో (Mahalaxmi Scheme) ఎంపికైన గ్యాస్‌ వినియోగదారులు సిలిండర్‌పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోనూ మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత అధికంగా ఉంటే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం. సిలిండర్‌ ధర రూ.970 ఉందనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోగా, మిగతా 130ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా జమ చేస్తుంది.

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - మూడేళ్ల సగటు లెక్క ప్రకారమే కసరత్తు!

Congress Mahalaxmi Scheme : దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలతో సిలిండర్‌ ధర అదనంగా ఉన్నా, ఆ భారం ప్రజలపై పడొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన పౌర సరఫరాల శాఖ అధికారులు ‘మహాలక్ష్మి’ కింద గ్యాస్‌ పథకాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా పథకం లబ్ధిదారుల జాబితాను నేడు ఇవ్వనున్నట్లు సమాచారం. అప్‌ ఫ్రంట్‌ మొత్తాన్ని చెల్లించనుంది. ఈ మేరకు రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తం ఎప్పటికప్పుడు ఆయిల్‌ కంపెనీలకు చేరేలా ఏర్పాట్లు చేస్తోంది.

బడ్జెట్​కు ముందు షాక్- గ్యాస్ సిలిండర్ ధర పెంపు

గ్యాస్​ సిలిండర్​ ఎక్స్​పైరీ డేట్ ఎలా చెక్ చేయాలో తెలుసా?

Last Updated : Feb 26, 2024, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.