Man With Gun Arrested in Peddapalli District :తుపాకీతో బెదిరించి భూ ఆక్రమణకు పాల్పడిన ఓ వ్యక్తిని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముస్కు రామయ్యకు వాళ్ల తాతల కాలం నాటి నుంచి వచ్చిన 5 ఎకరాల భూమి ఉంది. అయితే తన పేరుపైకి స్థలం ఎలా మార్పించుకోవాలో తెలియదు. రెవెన్యూ రికార్డులో తన పేరుపై ఎలా ఎక్కించుకోవాలో తెలియలేదు. ఈ క్రమంలోనే తన పొలం పక్కనే ఉన్న మల్లారెడ్డి, రామయ్య భూమిని తన పేరుపై రెవెన్యూ రికార్టుల్లో ఎక్కించుకున్నాడు. ఆ 5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన భూమి కోసం ఎక్కడికి పోయి అడిగినా గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారులు రామయ్య పేరు రికార్డు లేదని ఎలాంటి పరిష్కారం చూపలేమన్నారు.
మంచిర్యాలలో అత్తమామలపై అల్లుడి కాల్పులు
Land Fights in Peddapalli District : దాంతో తనకు భూమి దక్కదు అనే ఉద్దేశంతో పక్క గ్రామంలో ఇటుకల బట్టీలో పని చేయడానికి వెళ్లాడు. అందులో పని చేస్తున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన వారితో స్నేహం ఏర్పరుచుకున్నాడు. వారి ద్వారా యూపీలో సులభంగా తుపాకీ దొరుకుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఉత్తర్ప్రదేశ్కు వెళ్లి తుపాకీ తెచ్చుకున్నాడు. మల్లారెడ్డి, లేదా ఆయన కుమారుడిని చంపితే తనకు తన భూమి వస్తుందన్న ఆలోచనతో ఈ పనికి ఒడిగట్టాడు. తుపాకీ కోసం తోటి కార్మికుడితో కలిసి ఉత్తర్ప్రదేశ్ వెళ్లాడు. మొదటిసారి, రెండోసారి ఆయనకు తుపాకీ అమ్మేవారు దొరకలేదు. అదే పని మీద ఆగ్రా, కాన్పూర్ ప్రాంతాల్లో తిరిగాడు. తర్వాత ఆగ్రాలో దొరుకుతుందని తెలిసి, మళ్లీ అక్కడికి వెళ్లి తుపాకీ కొనుగోలు చేశాడు.