ఫ్యాక్టరీ మేనేజర్​పై పొరుగింటి వ్యక్తి కాల్పులు- ఆ గొడవ వల్లే!

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 2:05 PM IST

thumbnail

Neighbour Shot With Gun On Factory Manager :  ఓ ఫ్యాక్టరీ మేనేజర్​పై తుపాకీతో కాల్పులకు దిగాడు పొరుగింటి వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సంభల్​లోని బిసౌలి గేట్​ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ఇంటికి వెళ్తున్న మేనేజర్ హరిఓం శర్మ​ను మధ్యలో ఆపి కాల్పులు జరిపాడు ఆ వ్యక్తి. దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు అతడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనలో మేనేజర్​ శరీరంలో పలు బుల్లెట్లు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని సమీపంలోని ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. "హరి ఓం శర్మకు నాలుగు రోజుల క్రితం పక్కింటి వ్యక్తితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అతడు కాల్పులు జరిపాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. పరారీలో ఉన్న నిందితుడు విష్ణు అగర్వాల్​ను పట్టుకుంటాం" అని పోలీసులు ​తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.