తెలంగాణ

telangana

RCB విన్నింగ్ వైబ్స్- రాజస్థాన్ సెటైరికల్ ట్వీట్- అందులో అంత అర్థం ఉందా?

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 4:55 PM IST

RR Trolling RCB: 2024 డబ్ల్యూపీఎల్​లో ఆర్సీబీ ఛాంపియన్​గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై ఫన్నీ మీమ్స్​ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఆర్సీబీపై ఓ మీమ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

RR Trolling RCB
RR Trolling RCB

RR Trolling RCB:ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజీగా ఉంటుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆర్సీబీని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. దానిని నిజం చేస్తూ మొత్తంగా ఆర్సీబీ ఫ్రాంచైజీ 17 ఏళ్ల కల నెరవేరింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. పురుషుల టీమ్ నిరవేర్చని కలని నిజం చేసి చూపించింది. దీంతో మీమ్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చివరికి రాజస్థాన్ రాయల్స్ కూడా మీ కంటే ఉమెన్స్ టీమ్ స్ట్రాంగ్ అంటూ అర్థం వచ్చేలా ట్విటర్‌లో మీమ్ పోస్ట్ చేసింది.

ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బరిలో దిగినప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే మాట. 'ఈ సాలా కప్‌ నమ్​దే' అంటూ హంగామా చేసి, తీరా కీలక మ్యాచ్‌లలో ఓడిపోతూ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. దీంతో పురుషుల జట్టుకు 16 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ కలను ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అమ్మాయిలు నెరవేర్చారు.

విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌ సహా దిగ్గజ ఆటగాళ్లతో చాలా పటిష్ఠంగా కనిపించిన ఆర్సీబీ ఐపీఎల్‌లో ప్రతీసారి టైటిల్‌ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. కానీ, కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌ వంటి దిగ్గజాలు ఈ కలను సాకారం చేయలేకపోయారు. దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. దశాబ్దంన్నర కాలంగా పురుషుల జట్టు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ఫైనల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి నిజం చేశారు. దీంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైన‌ల్‌లో ఆర్సీబీ ఉమెన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్స్ టీమ్ ట్రోఫీ సాధించారని, ఇక ఆర్సీబీ మెన్స్ టీమ్ కప్ కలను తీర్చాలని నెట్టింట్లో పోస్ట్‌లు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్​ జట్టు రాజస్థాన్ రాయల్స్ దీనిపై ఫన్నీ మీమ్స్​ మొదలెట్టింది. ఏకంగా మగాళ్ళకంటే ఆడాళ్ళే మహా స్ట్రాంగ్ అనే భావం వచ్చేలా భర్త ఆలోచించేలోపే భార్య సునాయాసంగా గ్యాస్ సిలిండర్ మోసుకొని ఇంట్లోకి వెళుతున్నట్టుగా ఉన్న ఒక మీమ్ పోస్ట్ చేసింది. దీనికి ఆర్సీబీ ఫ్యాన్స్ మీమ్స్ కౌంటర్ ఇస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొందరు నెటిడజన్లు 'లేడీస్‌ ఫస్ట్‌' అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు. ఇక మిగిలింది మెన్స్‌ టీమ్‌' అంటూ ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు.

WPL 2024 'ఇకపై అలా అనండి' - ఫ్యాన్స్​కు కెప్టెన్ స్మృతి మంధాన సందేశం

WPL 2024 మిస్టరీ బాయ్​ఫ్రెండ్​తో స్మృతి మందాన - ట్రోఫీ పట్టుకుని పోజులిస్తూ

ABOUT THE AUTHOR

...view details