తెలంగాణ

telangana

హోరెత్తుతున్న ఓరుగల్లు రాజకీయం - నాటి మిత్రులే నేడు ప్రత్యర్థులుగా! - LOK SABHA ELECTION 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 12:45 PM IST

Political War in Warangal MP Seat : లోక్‌సభ ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్న వరంగల్‌ నియోజకవర్గంలో ఎట్టకేలకు ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా బీఆర్​ఎస్​ తమ అభ్యర్థిపై స్పష్టతనిచ్చింది. బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన వారినే రెండు జాతీయ పార్టీలు తమ అభ్యర్థులుగా బరిలోకి దించగా ఆచితూచి వ్యవహరించిన గులాబీ దళపతి ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఒకే గూటి నుంచి వచ్చి రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారిన ముగ్గురు అభ్యర్థుల సమరం ఓరుగల్లు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Parliament Election Battle in Warangal
Parliament Election Battle in Warangal

హోరెత్తుతున్న ఓరుగల్లు రాజకీయం

Political War in Warangal MP Seat :వరంగల్ లోక్​సభ స్థానానికి బీఆర్​ఎస్​ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ వీడటంతో లోక్‌సభ ఎన్నికల సమరం (Lok Sabha Election 2024) ఓరుగల్లులో రసవత్తరంగా మారుతోంది. హనుమకొండ జిల్లా పరిషత్‌ ఛైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్‌ను పార్టీ అభ్యర్ధిగా బీఆర్​ఎస్​ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం వరంగల్ పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ అందరితో చర్చించి ఆయనను అభ్యర్థిగా నిర్ణయించారు. వరంగల్ పార్లమెంట్ ( Warangal MP seat )నియోజకవర్గంలో గెలుపు అవకాశాలున్నాయని సమష్టిగా సాగి, పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలని గులాబీ బాస్‌ దిశానిర్దేశం చేశారు.

Lok Sabha Elections 2024 :హనుమకొండలోనే పుట్టి వైద్య విద్యను అభ్యసించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్​​ నుంచి ఎండీ చేసిన సుధీర్ కుమార్ బీఆర్​ఎస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో ఆదినుంచి విస్తృతంగా పాల్గొన్న ఆయన ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర గళం వినిపించారు. పార్టీ పట్ల, కేసీఆర్‌పైన అత్యంత విధేయంగా ఉండే ఆయన వరంగల్ ప్రజలు తనకు చారిత్రాత్రకమైన విజయం అందిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్​ఎస్​ అభ్యర్థిపై చివరకు సస్పెన్షన్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్​ఎస్​ అభ్యర్థి విషయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందరికన్నా ముందే కడియం కావ్య(Kadiyam Kavya)ను అభ్యర్థిగా నిర్ణయిస్తూ గులాబీ పార్టీ​ అధికారికంగా ప్రకటించింది. అయితే మారిన రాజకీయ పరిస్ధితులతో కావ్య ఆ పార్టీ​ తరఫున పోటీ చేయలేనంటూ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. కడియం శ్రీహరి, కావ్యలిద్దరూ భారత్ రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్​లో చేరారు. అధికారికంగా ప్రకటించిన అభ్యర్ధే పోటీ చేయలేనంటూ వైదొలగడం వెళ్తూ వెళ్తూ విమర్శలు గుప్పించటంతో కారు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

కావ్య వద్దనుకున్న స్థానంలో బీఆర్​ఎస్​ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టేషన్​ ఘన్​పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తమ పేర్లు కూడా పరిశీలించాలంటూ మరికొందరు జిల్లా నాయకులు వినతులు ఇచ్చారు. ఆచితూచి వ్యవహరించిన గులాబీ పార్టీ​ నాయకత్వం చివరకు సుధీర్ కుమార్ వైపు మొగ్గు చూపింది.

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసించిన మజ్లిస్ పార్టీ - కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ పంచన చేరింది : కిషన్‌ రెడ్డి

ఆరూరి రమేశ్​ వర్సెస్​ కడియం కావ్య : ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. సీనియర్‌ నేత కడియం శ్రీహరి లక్ష్యంగా ఆయన కుమార్తె కావ్యపై కమలం పార్టీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌(Aruri Ramesh vs Kadiyam Kavya) విమర్శలదాడి చేయగా అదే స్థాయిలో కడియం తిప్పికొట్టారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి పోటీ చేస్తున్న హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులిద్దరూ గులాబీ గూటికి నుంచి వచ్చిన వారు కావడం విశేషం.

వారు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవటంతో ఎవరూ ఊహించని విధంగా బీఆర్​ఎస్​కు గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరినవారే. నిన్నటి వరకూ మిత్రులుగా ఉండి సభలు సమావేశాల్లో పాల్గొని ఇప్పుడు పార్టీలు మారి ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులుగా దిగి మాటల తూటాలు పేల్చుతున్నారు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికలకు ఓరుగల్లులో అభ్యర్థుల ఖరారే మలుపులు తిప్పగా ఇక వారి మధ్య ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతోంది.

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు

రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? - బీజేపీపై పొన్నం ఫైర్

ABOUT THE AUTHOR

...view details