తెలంగాణ

telangana

జిల్లాల్లో సాఫ్ట్​వేర్​ కంపెనీలు ఎందుకు రావట్లేదో అధ్యయనం చేస్తాం : శ్రీధర్​బాబు

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 3:49 PM IST

Minister Sridhar Babu Development of IT Towers in Karimnagar : రాష్ట్రంలో తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ రంగం విస్తరించాలని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లాకు సాఫ్ట్​వేర్​ కంపెనీలు ఎందుకు రావట్లేదో అధ్యయనం చేస్తామని వివరించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అత్యధిక సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Sridhar Babu Comments on BRS Leaders
Minister Sridhar Babu Development of IT Towers

Minister Sridhar Babu Development of IT Towers in Karimnagar : జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్‌ నిర్మించినా అనుకున్న మేరకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఎందుకు రావడంలేదో అధ్యయనం చేసి ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) చెప్పారు. ఐటీ టవర్లు నిర్మించినంత మాత్రాన ఐటీ వృద్ది జరగదని వాటిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగం హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించి అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

ఆరు గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నాం : శ్రీధర్‌బాబు

Minister Sridhar Babu on Expand IT Towers : హైదరాబాద్‌ నుంచి ధర్మపురి వెళ్తున్న క్రమంలో కరీంనగర్​లో కొంతసేపు ఆగి మీడియాతో శ్రీధర్​బాబు మాట్లాడారు. బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు తమ ఉనికి కాపాడుకోవడానికే ఆరాటపడుతున్నాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కేవలం మేనిఫెస్టో(Sridhar Babu on Manifesto Discussion) ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అవుతున్నాయి అనే అంశంపై చర్చ జరిగిందన్నారు. దీంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రమే సమీక్ష జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్లో మంచి విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. మేడిగడ్డ నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడమే కాకుండా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందిస్తుందని స్పష్టం చేశారు.

అధికారులు సమర్థవంతంగా పని చేసి లక్ష్యాలు సాధించాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జిల్లాల్లోకి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఎందుకు రావట్లేదో అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఐటీ టవర్లు నిర్మించినంత మాత్రాన ఐటీ వృద్ది జరగదు. ఐటీ టవర్లు బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నాం. త్రీటైర్‌ పట్టణాలకు కూడా ఐటీ రంగం విస్తరించాలి. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఉనికి కాపాడుకోవడానికే బీఆర్ఎస్​, బీజేపీ ఆరాట పడుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తాం.- శ్రీధర్‌బాబు, ఐటీ పరిశ్రమల శాఖమంత్రి

Sridhar Babu Comments on BRS Leaders : కరీంనగర్​లో ఐటీ కారిడార్​ను బలోపేతం చేసేందుకు హెచ్​సీఎల్ లాంటి పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నామని శ్రీధర్​బాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఎవరో కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదని, ప్రజలు తమకు ఎన్ని రోజులు అవకాశమిస్తే అన్ని రోజులు అధికారంలో ఉంటామని బదులిచ్చారు. గత ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగిస్తామని చెప్పారు. దావోస్​లో వచ్చిన పెట్టుబడులపై బీఆర్ఎస్ వ్యాఖ్యలు అర్థరహితమని శ్రీధర్‌బాబు విమర్శించారు. ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కొన్ని పనులను కొనసాగిస్తుంటాయని తెలిపారు. ఆ పని మేమే చేశామని బీఆర్ఎస్ చెప్పుకుంటే అవివేకమౌతుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

జిల్లాలో సాఫ్ట్​వేర్​ కంపెనీలు ఎందుకు రావట్లేదో అధ్యయనం చేస్తున్నాం మంత్రి శ్రీధర్​బాబు

రేపు మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, ప్రాజెక్టు లాభనష్టాలపై రివ్యూ

ABOUT THE AUTHOR

...view details