'సారూ.. ఈ తిండి ఎలా తినగలం?'.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్​!

By

Published : Aug 11, 2022, 8:57 AM IST

Updated : Aug 11, 2022, 10:58 AM IST

thumbnail

"రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న మాకు ఇలాంటి భోజనం పెడతారా? దీన్ని అసలు ఎవరైనా తినగలరా?" అంటూ నడిరోడ్డుపై బోరున విలపించాడు ఓ కానిస్టేబుల్. ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లోని పోలీస్ మెస్​లో తమకు అందించే ఆహారం అస్సలు బాగుండడం లేదని, ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్​ మనోజ్ కుమార్.. ఇలా బుధవారం భోజనం ప్లేటుతో రోడ్డుపైకి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం రూ.1875 ఇస్తామన్న సీఎం యోగి ఆదిత్యనాథ్​ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఈ వీడియో వైరల్ కాగా.. సీనియర్ ఎస్​పీ ఆశిష్ తివారీ స్పందించారు. దర్యాప్తునకు ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మనోజ్​పై మొత్తం 15 కేసులు పెండింగ్​లో ఉన్నాయని.. వాటి సంగతి కూడా తేల్చాలని సీఐని ఆదేశించారు.

Last Updated : Aug 11, 2022, 10:58 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.