రైలులో మొబైల్​ చోరీ చేసిన యువకుడిని బయటకు తోసేసి హత్య

By

Published : Dec 18, 2022, 11:05 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

ఉత్తర్​ ప్రదేశ్ బరేలి​లో దారుణం జరిగింది. రైలులో మొబైల్​ చోరీ చేశాడని ఓ యువకుడిని తీవ్రంగా కొట్టారు ప్రయాణికులు. అతడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. అనంతరం ఎమర్జెన్సీ డోర్​ నుంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా తోటి ప్రయానికులు ఘటనను అడ్డుకోవడం మానేసి వారు సహకరిస్తున్నట్లు వీడియోలో అర్థమవుతోంది. బరేలి- న్యూదిల్లీ మధ్య నడుస్తున్న అయోధ్య ఎక్స్‌ప్రెస్‌లో ఘటన జరిగింది. యువకుడిని కొట్టిన వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వారు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.