BJP నేత కుమారుడి కారుపై బాంబుల దాడి.. వారిపైనే డౌట్!

By

Published : Apr 7, 2023, 2:53 PM IST

thumbnail

బీజేపీ మహిళా నేత కుమారుడి కారుపై కొందరు దుండగులు బాంబు దాడి చేశారు. కారు ఆగి ఉన్న సమయంలో రెండు బైక్​లపై వచ్చిన ఆరుగురు దుండగులు.. రెండు సార్లు బాంబులు వేశారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్​.. కారును మందుకు నడిపి త్రుటిలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అలహాబాద్​ జిల్లాలో జరిగింది.

ఝాన్సీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని గంగపర్​ ప్రాంతానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా నేత విజయలక్ష్మి సింగ్ చందెల్​ కుమారుడు గురువారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లాడు. మార్గమధ్యలో అతడి కారును కొందరు దుండగులు ఆపారు. రెండు బైక్​లపై వచ్చిన వారు.. వెంట వెంటనే రెండు బాంబులతో దాడి చేశారు. అయితే ఈ  దాడి వెనుక పోలీసు కానిస్టేబుల్​ శివం బచ్చన్ యాదవ్ కుమారుడు శివం యాదవ్​ ఉన్నాడని విజయలక్ష్మి ఆరోపించారు. నడిరోడ్డులో కారుపై  బాంబులతో  దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్​ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి జరగడానికి గల కారణాలేంటో కనుక్కోవాలని పోలీసులను కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమేశ్​ పాల్​ హత్య మరవకముందే.. ఈ ఘటన జరగడం ఆ జిల్లాలో కలకలం రేపింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.