డ్రోన్​ ద్వారా బ్లడ్​​ డెలివరీ.. దేశంలోనే తొలిసారి!

By

Published : May 10, 2023, 6:26 PM IST

thumbnail

దేశంలోనే తొలిసారి డ్రోన్​ ద్వారా రక్తాన్ని రవాణా చేసింది భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎం​ఆర్​). ది గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(GIMS), లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్(LHMC)ల నుంచి సేకరించిన 10 యూనిట్ల రక్తం ప్యాకెట్ల నమూనాలను ఈ డ్రోన్​ ద్వారా తరలించారు. ఈ ప్రయోగాన్ని ఉత్తర్​ప్రదేశ్​ నొయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (JIIT) దగ్గర చేపట్టారు. సంప్రదాయ పద్ధతితో పోల్చితే.. డ్రోన్ల ద్వారా బ్లడ్​ బ్యాగులను తరలించే విధానంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ రాజీవ్​ భాల్​. 

"ఆరోగ్య రంగంలో ఈ ఐ-డ్రోన్​ సేవలను ఇంతకుముందు కొవిడ్​ విజృంభణ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఐసీఎమ్​ఆర్ ఉపయోగించింది. వీటి ద్వారా వ్యాక్సిన్​ల అవసరం ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అధిక సంఖ్యలో వ్యాక్సిన్​ డోస్​లను సరైన సమయంలో సరఫరా చేయగలిగాము. కొన్ని ప్రాంతాలకు వీటిని రోడు మార్గంలో పంపాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ రకంగానే దేశంలో అనేక ప్రయోగాలు చేశారు. దీని ద్వారా ఔషధాలను కూడా పంపిణీ చేశారు. ఈ ఐ-డ్రోన్​ ప్రత్యేకత ఏంటంటే రక్తం​తో పాటు దాని అనుబంధ ఉత్పత్తులు కూడా సరఫరా అవుతున్నాయి. రక్తం పాడవ్వకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అంబులెన్స్​ల ద్వారా పంపే సంప్రదాయ పద్ధతికి ఈ ఐ డ్రోన్​లకు పెద్ద తేడాల్లేవు. పైగా రోగికి సకాలంలో బ్లడ్​ అందించడమే కాకుండా మెరుగైన ఫలితాలు వచ్చాయి. మున్ముందు ఈ ఐ డ్రోన్​ వ్యవస్థను దేశమంతటా విస్తరిస్తాము. భవిష్యత్​లో కేవలం రక్తం, మందులు మాత్రమే కాకుండా అవయవాలను కూడా సరఫరా చేయాలని అనుకుంటున్నాము." అని వివరించారు ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ రాజీవ్​ భాల్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.