వరదల్లో పారాగ్లైడర్ల సాహసం- ఆహారపొట్లాలతో ఎగురుకుంటూ వెళ్లి...

By

Published : Sep 30, 2021, 4:35 PM IST

thumbnail

థాయిలాండ్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సుఖోథాయి​ రాష్ట్రంలో వందలాది గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు అందులోనే చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మానవత్వంతో వ్యవహరిస్తున్నారు పారాగ్లైడర్లు. ముంపు ప్రాంతాల వారికి ఆకాశం నుంచి ఆహారపొట్లాలు చేరవేస్తూ.. ఎంతోమందికి ఆకలి తీర్చుతున్నారు. కొద్దిరోజుల నుంచి అవిశ్రాంతంగా సేవచేస్తున్నారు. నూడుల్స్​, వాటర్​ బాటిళ్లు, బియ్యం, పండ్లు ఇతరత్రా అందిస్తున్నారు. భారీ వరదలతో రాజధాని బ్యాంకాక్​కు కూడా ముప్పు పొంచి ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది సైన్యం. థాయిలాండ్​ వ్యాప్తంగా మొత్తం 2 లక్షలకుపైగా ఇళ్లు నీటమునగగా.. ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.