వేములవాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు - స్వామి దర్శనానికి ఐదు గంటల సమయం - RUSH AT VEMULAWADA TEMPLE TODAY
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : May 27, 2024, 2:25 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-05-2024/640-480-21569413-thumbnail-16x9-rush.jpg)
Devotees Rush in Vemulawada Rajanna Temple : తెలంగాణ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకుని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత, అన్న పూజల సేవలు రద్దు చేశారు.
Huge Devotees in Vemulawada Temple : కోడె మొక్కలు చెల్లించుకునే భక్తులకు ఐదు గంటలు, ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు తమ కుటుంబ సభ్యులతో రాజన్న సన్నిధికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయమంతా భక్తజనంతో కిటకిటలాడింది. రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో ఆలయ మాఢ వీధులు మార్మోగాయి. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలం తాగు నీటికి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేశారు.