ETV Bharat / snippets

'5 రోజుల్లో దేశంలోకి రుతుపవనాలు!'- IMD గుడ్​ న్యూస్

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 2:00 PM IST

Monsoon 2024 Kerala
Monsoon 2024 Kerala (ANI)

Monsoon 2024 Kerala : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు గుడ్​ న్యూస్​ చెప్పింది భారత వాతావరణ శాఖ. వచ్చే 5 రోజుల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. భారత వాతవరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్​ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్​8న, 2022లో మే 29న, 2021లో జూన్​ 3న, 2020లో జూన్​1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.