ప్లాట్​ఫాంపై కుప్పకూలిన వ్యక్తి- కాపాడిన కానిస్టేబుల్​

By

Published : Feb 20, 2021, 3:11 PM IST

Updated : Feb 20, 2021, 3:42 PM IST

thumbnail

అనిల్​గుంజా అనే సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్ ఓ వ్యక్తికి ప్రాణం పోశారు. దిల్లీలోని ద్వారకా నుంచి నోయిడా వెళుతున్న మెట్రో రైలు ఇంద్రప్రస్థ స్టేషన్​లో ఆగింది. అందులోనుంచి జావేద్​ అలీ అనే వ్యక్తి దిగాడు. ప్లాట్​ఫాంపై దిగిన కాసేపటికే కుప్పకూలిపోయాడు. సీసీటీటీలో గమనించిన అనిల్​ గుంజా అధికారులతో సహా ఘటన ప్రదేశానికి వచ్చిచూసేసరికి అతను చలనం లేకుండా ఉన్నాడు. వెంటనే జావేద్​కు గుండెపై 'సీపీఆర్​' చేసి అతనికి ఊపిరిపోశారు. తదనంతరం చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. సంబంధిత వీడియో వైరల్​ అవుతోంది. ప్రస్తుతం జావేద్​ పరిస్థితి బాగున్నట్లు వైద్యులు తెలిపారు. తనను రక్షించిన పోలీసులకు జావేద్​ ధన్యవాదాలు తెలిపాడు.

Last Updated : Feb 20, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.