వీడ్కోలు వేదికపై పాటలతో అలరించిన రాజ్యసభ ఎంపీలు

By

Published : Mar 31, 2022, 10:51 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

పదవీకాలం పూర్తి చేసుకున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశంలో తమ గానంతో అలరించారు పలువురు ఎంపీలు. వేదికపై కలిసికట్టుగా పాటలు పాడారు. కొందరు గిటారు వాయించారు. భాజపా ఎంపీ రూపా గంగూలీ ఓ సినిమా పాటను ఆలపించి అందరిని మెప్పించారు. అంతకు ముందు పదవీకాలం పూర్తవుతున్న ఎంపీలకు జ్ఞాపికలు అందజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.