ETV Bharat / state

పెండింగ్‌లోని భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్‌

author img

By

Published : Jul 3, 2020, 10:55 PM IST

పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు పెండింగ్‌లో ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్‌లోని భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్‌
పెండింగ్‌లోని భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్‌

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల పరిధిలోని భూ సమస్యలపై చర్చించారు. భూ సమస్యలు పెండింగ్‌లో ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించేందుకు వీలున్న కేసులకు సంబంధించిన వివరాలను రికార్డులలో పూర్తి స్థాయిలో పరిశీలించాలని కోరారు. వీలైనంత త్వరగా కేసులకు పరిష్కరించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.