ETV Bharat / bharat

ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

author img

By

Published : Jul 3, 2020, 1:28 PM IST

100 మందికి పైగా ఐఏఎస్​ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాజస్థాన్​ ప్రభుత్వం. అలాగే ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజీవ్​ స్వరూప్​ను నియమిస్తున్నట్లు తెలిపింది.

Rajasthan govt transfers over 100 IAS officers
ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

రాజస్థాన్​ ప్రభుత్వం మొత్తం 103 మంది ఐఏఎస్​ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజీవ్​ స్వరూప్​ను​ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న రోహిత్ కుమార్ సింగ్‌కు హోం కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి ఆరోగ్య విభాగ బాధ్యతలను అఖిల్​ అరోరా నిర్వర్తిస్తున్నారు. బదిలీ చేసిన జాబితాలో ముగ్గురు అదనపు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు డివిజినల్​ కమిషనర్లు, 15 మంది కలెక్టర్లు ఉన్నారు.

అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి బి గుప్తా గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గుప్తా ఈ ఏడాది సెప్టెంబర్​లో, రాజీవ్​ స్వరూప్​ అక్టోబర్​లో పదవీ విరమణ కానున్నారు.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరికీ కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.