ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరికీ కరోనా పరీక్షలు

author img

By

Published : Jul 3, 2020, 12:27 PM IST

గోవాలోని ఎమ్మెల్యేలందరూ కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. జులై 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్​ రాజేశ్ పట్నేకర్​ ఈ మేరకు కోరారు.

Get tested for COVID-19 ahead of session: Goa Speaker to MLAs
ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరికి కరోనా పరీక్షలు

గోవాలో అసెంబ్లీ వర్షకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర స్పీకర్ రాజేష్​ పట్నేకర్​​ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

వివిధ కారణాల దృష్ట్యా ఎమ్మెల్యేలు ప్రజలను కలుస్తారు కనుక తప్పనిసరిగా వైరస్​ పరీక్షలు చేయించుకోవాలని పట్నేకర్​ అన్నారు. ఇటీవల ఓ భాజపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​గా​ తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​. జులై 27 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:భారత్​లో రెండో వ్యాక్సిన్-​ ప్రయోగానికి అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.