ETV Bharat / state

కమలాపూర్‌ పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం బయటికొచ్చిందిలా: సీపీ

author img

By

Published : Apr 4, 2023, 11:02 PM IST

Warangal CP Ranganath responded on Hindi paper leak: రాష్ట్రంలో వరుసగా రెండో రోజు పదో తరగతి పేపర్ లీకైన ఘటన కలకలం రేపింది. అయితే ఈ పేపర్ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. దీనిపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. హిందీ పేపర్ ఎలా బయటకు వచ్చింది, దానిని వాట్సాప్​లో ఎవరు వైరల్ చేశారనే విషయాలను సీపీ మీడియాకు వెల్లడించారు. హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కాలేదని, లీకేజీకి కాపీయింగ్​కు తేడా ఉంటుందని సీపీ తెలిపారు. దురుద్దేశపూర్వకంగా చేసిన ఈ ప్రచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దని సీపీ వారికి విజ్ఞప్తి చేశారు.

Warangal CP Ranganath
Warangal CP Ranganath

కమలాపూర్‌ కేంద్రం నుంచి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చింది: సీపీ

Warangal CP Ranganath responded on Hindi paper leak: రాష్ట్రంలో పదో తరగతి హిందీ పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపిన విషయం విధితమే. అయితే ఈ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. హిందీ పేపర్​ ఎలా బయటకు వచ్చింది, వాట్సాప్‌లో ఎవరు వైరల్‌ చేశారనే విషయాలను వరంగల్‌ సీపీ రంగనాథ్‌ మీడియాకు వెల్లడించారు. కమలాపూర్ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చిందన్నారు. ఓ మైనర్‌ బాలుడు.. కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామానికి చెందిన తన స్నేహితునికోసం చెట్టు కొమ్మ పట్టుకుని ఒకటో అంతస్థులోని పరీక్ష కేంద్రంలోకి వెళ్లాడు.

అయితే రూమ్‌ నెం.3 కిటికీ చెట్టుకు ఆనుకుని ఉంటుంది. ఆ బాలుడు అక్కడ పరీక్ష రాస్తున్న హరీశ్‌ అనే విద్యార్థి వద్ద పేపర్‌ తీసుకుని తన వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. అనంతరం తన ఫ్రెండ్‌కు చీటీలు ఇద్దామని వెళ్లాడు. ఈ క్రమంలో హిందీ పరీక్ష పేపర్​ ఫొటోలను శివ గణేశ్​కు పంపించాడు. ఎస్‌ఎస్‌సీ గ్రూపులో 31 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రూపులో ఆ హిందీ పేపర్​ ఫొటోను శివ గణేశ్​ పోస్టు చేశాడు. పరీక్ష ఉదయం 9.30 మొదలవ్వగా.. 9.45 గంటలకు బాలుడు ఆ పేపర్​ను ఫొటో తీశాడు.

9.55 గంటలకు శివ గణేశ్ ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్ గ్రూపులో పోస్టు చేశాడు. ఆ తర్వాత (మాజీ విలేకరి) ప్రస్తుతం కేఎంసీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గుండెబోయిన మహేశ్‌కు ఆ పరీక్ష పేపర్​ని ఫార్వర్డ్‌ చేశాడు. మహేశ్‌ వెంటనే ఆ హిందీ పేపర్​ని ప్రశాంత్‌కు పంపించాడు. అలా అక్కడినుంచి వివిధ గ్రూపులలో పరీక్ష పేపర్​ వైరల్‌ అయింది. దీనిని ప్రశాంత్‌.. ఆ పేపర్​ ఫొటోతో పాటు.. బ్రేకింగ్‌ న్యూస్‌ వరంగల్‌లో హిందీ పేపర్‌ లీకైంది. ఉదయం 9.30 గంటలకే లీకైన పరీక్ష పేపర్. వరుసగా రెండో రోజు పదో తరగతి పేపర్ లీక్‌. ఈ మేరకు ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్‌ వాట్సప్‌ గ్రూపులో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షం.. అని టెక్ట్స్‌ మెసేజ్‌ పెట్టాడు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేసే విధంగా ప్రచారం చేశారు.

ఈ మెసేజ్‌ను హైదరాబాద్‌లో ఉన్న కొందరు మీడియా ప్రజా ప్రతినిధులకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు 11.24కు మెసేజ్​ ఫార్వర్డ్‌ చేశారు. హిందీ పరీక్ష పేపర్ లీక్‌ కాలేదు. లీకేజీకి కాపీయింగ్‌కు తేడా ఉంటుందని సీపీ తెలిపారు. పరీక్ష ప్రారంభం కాకముందు ఎగ్జామ్​ పేపర్ బయటకు వస్తే లీక్‌. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నపత్రం బయటకు వస్తే అది కాపీయింగ్‌ అవుతుందని తెలిపారు. నిందితులపై సెక్షన్‌ 5 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మైనర్‌ బాలుడిని జువైనల్‌ హోంలో హాజరు పరుస్తామని చెప్పారు. శివ గణేష్‌, ప్రశాంత్‌, మహేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ వివరించారు. దురుద్దేశపూర్వకంగా చేసిన ఈ ప్రచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దని సీపీ రంగనాథ్ వారికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.