ETV Bharat / state

ఎన్టీఆర్.. నిస్వార్థ సేవకు చిరునామా : నారా భువనేశ్వరి

author img

By

Published : Jan 18, 2023, 4:53 PM IST

Nara Bhuvaneshwari
Nara Bhuvaneshwari

దివంగత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నిస్వార్థ సేవకు చిరునామా అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పడిపోయాయని పేర్కొన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్ఠాయిగా నిలిచిపోతారని ఆమె తెలిపారు.

దివంగత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారని.. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. కానీ, ప్రస్తుతం రాజకీయ విలువలు పడిపోయాయని పేర్కొన్నారు. తద్వారా స్వార్థ రాజకీయాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో ఏర్పాటు చేసిన మెగా లెంజెండరీ రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు.

ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ సహా కంటి, దంత, గుండె, ఎముకలు, నరాల వంటి విభాగాలకు సంబంధించిన టెస్టులు ఉచితంగా నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ తెలుగు వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని నారా భువనేశ్వరి తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేసిన రియల్ హీరో ఎన్టీఆర్ అని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి.. కుటుంబసభ్యులు సహా ప్రముఖుల నివాళులు

మూడు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.