ETV Bharat / state

న్యూ ఇయర్ రోజున నెత్తురోడిన రహదారులు - ఆరుగురి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 2:51 PM IST

Sangareddy Road Accident
New Year Road Accidents In Telangana

New Year Road Accidents In Telangana : కొత్త ఏడాది తొలి రోజున రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. నూతన సంవత్సరానికి ఆనందంగా ఆహ్వానం పలుకుతూ సంబురాలు జరుపుకునే వేళ కొన్ని కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

New Year Road Accidents In Telangana : కొత్త సంవత్సరం వేడుకల వేళ తెలంగాణలో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో విషాదం నింపాయి. పోలీసులు న్యూ ఇయర్ రోజున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలు చోట్ల ప్రమాదాలు పలువురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. న్యూ ఇయర్ రోజున ఆ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చాయి.

Sangareddy Road Accident : సంగారెడ్డి పటాన్‌చెరులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నోవాపాన్‌ కూడలికి సమీపంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారు భరత్‌చంద్‌, నితిన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కారును ఢీకొట్టి టోల్​ప్లాజా క్యాబిన్​లోకి దూసుకెళ్లిన లారీ

Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని బొంగ్లూర్‌ వద్ద ఓ ఆర్ ఆర్ సర్వీస్‌ రోడ్డుపై ద్విచక్రవాహనం అదుపుతప్పి అనిల్‌కుమార్‌ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేటలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. సూర్యాపేట హైటెక్ బస్‌స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన నట్‌రాజ్‌ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

యాక్సిడెంట్​లు తగ్గాయి, రేప్​ కేసులు పెరిగాయి - హైదరాబాద్ కమిషనరేట్​ వార్షిక నేర నివేదిక విడుదల

Car Accident In Hyderabad : హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్​బీ (KPHB) కాలనీలో కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మోతీనగర్‌కు చెందిన అరుణ్‌ అనే వ్యక్తి మిత్రాహిల్స్‌ నుంచి హైదర్‌నగర్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన స్కోడా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అరుణ్‌(33) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

Road Accident in Medchal : మేడ్చల్‌ జిల్లాలోని బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో బైక్‌ ఢీకొని ఒకరు మృతి చెందాడు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపి ఒక వ్యక్తిని ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో ఉన్న వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా కొత్త ఏడాదికి ఎంతో సంబురంతో స్వాగతం పలకాల్సిన వేళ పలువురు రోడ్డు ప్రమాదాల్లో తమ ఆత్మీయులను కోల్పోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

'న్యూ ఇయర్​ ఎంజాయ్​ చేయండి - పరిమితులు దాటొద్దు'

కొత్త ఏడాది కొంగొత్త నిర్ణయాలు - నూతన లక్ష్యాలతో ముందుకు వెళ్తామంటున్న యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.