కారును ఢీకొట్టి టోల్​ప్లాజా క్యాబిన్​లోకి దూసుకెళ్లిన లారీ

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 6:56 PM IST

Updated : Dec 26, 2023, 7:46 PM IST

thumbnail

Lorry Hit a car at Nizamabad Toll Plaza : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి 44వ జాతీయ రహదారి టోల్​ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంతో వచ్చి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం లారీ టోల్​ప్లాజా క్యాబిన్​లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా టోల్​ప్లాజాలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కూడా గాయపడ్డారు. దీంతో అక్కడున్న స్థానికులు లారీ డ్రైవర్​కు దేహశుద్ధి చేశారు.

Nizamabad Toll Plaza Accident :  కారులోని గాయపడిన ప్రయాణికులను, టోల్​ప్లాజా సిబ్బందిని చికిత్స నిమిత్తం నిజామాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టోల్​ప్లాజాకు సంబంధించిన క్రేన్​(Toll Plaza Crane) సాయంతో లారీని ఘటన స్థలం నుంచి పక్కకు తొలగించారు. డిచ్​పల్లి సీఐ కృష్ణ వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని లారీ డ్రైవర్​ను ఆదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.    

Last Updated : Dec 26, 2023, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.