ETV Bharat / state

ఆ బడిలో.. మెట్లకింద పాఠాలు.. చెట్ల కింద చదువులు

author img

By

Published : Feb 23, 2023, 2:24 PM IST

Lack of facilities in lingampet Government School: ఆ పాఠశాలకు దాతలు తమవంతుగా సహకారం అందించారు.. విద్యార్థులకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో అన్నిసౌకర్యాలు కల్పించారు. అందరూ అనుకున్నట్లే ఆ విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం వారి పాలిట శాపంగా మారుతోంది. గదుల నిర్మాణం చేపట్టకపోవటంతో మెట్ల కిందే చదువులు సాగించాల్సిన దుస్థితి. కొందరు చెట్ల కింద చదువులు సాగిస్తుంటే.. మరికొందరు ఎండలోనే పాఠాలు వింటున్నారు.

Etv Bharat
Etv Bharat

పాఠశాలలో అదనపు తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు

Lack of facilities in lingampet Government School: జగిత్యాల జిల్లాలోని లింగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆంగ్ల మాధ్యమంలో సాగుతున్న ఈ బడి.. ప్రైవేట్‌కి దీటుగా ఉంది. 12 ఏళ్లుగా పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తోంది. ఈ పాఠశాలకు దాతలు తమవంతుగా సహకారం అందిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు తిరుమల్‌ వద్ద చదివిన పూర్వ విద్యార్థులు, స్థానికుల ద్వారా విరాళాలు సేకరించారు. 70 సైకిళ్ళతోపాటు కంప్యూటర్‌ ల్యాబ్‌, డెస్క్‌లు, కుర్చీలు వంటివాటిని దాతలు అందించారు.

అయితే ప్రభుత్వం అండగా నిలవకపోవడంతో సమస్యలు తప్పడం లేదు. స్కూల్‌లో కేవలం రెండు గదులు మాత్రమే ఉండగా ఒకదాన్ని కంప్యూటర్‌ ల్యాబ్‌కు కేటాయించారు. ఇంకో గదితోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. కొందరు విద్యార్థులు మెట్ల కింద చదువుకుంటుంటే మరికొందరు చెట్ల కిందే పాఠాలు వింటున్నారు.

ప్రహరీగోడ లేకపోవటంతో పక్కనే రహదారి నుంచి ఏ వాహనం ఎప్పుడు దూసుకోస్తుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం 'మన ఊరు మనబడి' కార్యక్రమం కింద గదుల నిర్మాణం చేపట్టి ప్రహరీ గోడ నిర్మిస్తే మరింత మంది విద్యార్థులకు బడిలో చేరే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

"పూర్వ విద్యార్థులు, స్థానికుల ద్వారా విరాళాలు సేకరించాం. 70 సైకిళ్లతోపాటు కంప్యూటర్‌ ల్యాబ్‌, డెస్క్‌లు, కుర్చీలు వంటివాటిని దాతలు అందించారు. స్కూల్‌లో కేవలం రెండు గదులు మాత్రమే ఉండగా ఒకదాన్ని కంప్యూటర్‌ ల్యాబ్‌కు కేటాయించారు. ఇంకో గదితోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. కొందరు విద్యార్థులు మెట్ల కింద చదువుకుంటుంటే.. మరికొందరు చెట్ల కిందే పాఠాలు వింటున్నారు." - పాఠశాల ఉపాధ్యాయులు

"మా పాఠశాలకు సరిపడా తరగతి గదులు లేవు. కొన్ని తరగతుల పిల్లలం మెట్ల కింద కూర్చుంటున్నాం. మరికొందరం చెట్ల కింద కూర్చుని పాఠాలు వింటున్నాం. పాఠశాల చుట్టూ ప్రహరిగోడ లేదు. వాహనాలు వెళ్లడం వల్ల పాఠాలు వినడానికి డిస్టర్బెన్స్​గా ఉంది. పాఠశాలలో అందరికి సరిపడా టాయిలెట్లు కూడా లేవు". - విద్యార్థులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.