ETV Bharat / state

హైదరాబాద్​కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం!

author img

By

Published : May 9, 2021, 1:40 PM IST

police to serve notice to chandrababu naidu
చంద్రబాబుపై కర్నూలు లో కేసు నమోదు

ఏపీలోని కర్నూలు జిల్లాలో చంద్రబాబుపై నమోదైన కేసులో పోలీసులు హైదరాబాద్​కు రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ ఒకటో పట్టణ పోలీస్​స్టేషన్​లో తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులో.. పోలీసులు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్​లోని ఆయన నివాసానికి కర్నూలు పోలీసులు చేరుకుని నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప శనివారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

చంద్రబాబు నాయుడికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరతామని కర్నూల్‌ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లోని తన నివాసంలో ఉన్నందున పోలీసులు.. హైదరాబాద్​కు చేరుకుని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ గురించి చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారని.. న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూల్ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఇదీ చదవండి: ఆన్‌లైన్​లో ఆక్సిజన్‌.. మోసపోతావు మహాజన్‌.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.