ETV Bharat / state

Pil in Allotment on Land to BRS : బీఆర్​ఎస్​కు కోకాపేటలో భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్

author img

By

Published : Jul 10, 2023, 6:14 PM IST

Updated : Jul 10, 2023, 7:58 PM IST

telangana highcourt
telangana highcourt

17:59 July 10

బీఆర్​ఎస్​కు భూకేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్

Pil in Highcourt Allotment on Land to BRS : బీఆర్​ఎస్​కు భూకేటాయింపుపై హైకోర్టులో ఫోరం ఫర్​ గుడ్ గవర్నెన్స్ పిల్ ధాఖలు చేసింది. కోకాపేటలో ఖరీదైన భూమిని భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం కోసం కేటాయించారని తెలిపింది. రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని పేర్కొంది. ఐదు రోజుల్లోనే కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారన్న ఎఫ్‌జీజీ.. భూకేటాయింపు డాక్యమెంట్లన్నీ రహస్యంగా పెట్టారని వివరించింది. శిక్షణ, ఎక్సలెన్స్ కేంద్రం పేరిట బీఆర్​ఎస్ భూమి పొందిందని అన్నారు. బీఆర్​ఎస్​కు బంజారాహిల్స్​లో పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ మళ్లీ భూమి కేటాయించారని.. వెంటనే ఈ భూ కేటాయింపు జీవోను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. కోకాపేటలో నిర్మాణ పనులు జరపకుండా స్టే ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్​ హైకోర్టును కోరింది.

ఇటీవలే కోకాపేటలో బీఆర్ఎస్ మానవ వనరుల కేంద్రానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులకు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ పేరుతో భారత్​ రాష్ట్ర సమితి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

పార్టీ నాయకులకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించాలని బీఆర్​ఎస్​ నిర్ణయంచింది. ఇందుకోసం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లకు చెందిన 11 ఎకరాల భూమిని బీఆర్​ఎస్​కు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కేటాయించారు. వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో వెంటనే భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపట్టారు. బీఆర్ఎస్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం అన్ని రకాల అనుమతులు లభించినట్లు సమాచారం. పార్టీ నేతలు, శ్రేణులకు శిక్షణ ఇవ్వడం, వసతి సౌకర్యం, గ్రంథాలయాలు, సెమినార్ హాల్స్ ఉండేలా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కానీ ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ భూ కేటాయింపును రద్దు చేయాలని హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది.

HC hearing Ponnam Petition on Gangula Election : మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికపై.. పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. 2018 ఎన్నికల్లో గంగుల పరిమితికి మించి ఖర్చు చేశారని పొన్నం పిటిషన్​లో పేర్కొన్నారు. మంత్రి ఎన్నికల ఖర్చు వివరాలు ఇచ్చేలా ఈసీని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇన్నేళ్ల తర్వాత పత్రాలు ఈసీ ఇవ్వాలనడం అభ్యంతరమని గంగుల కమలాకర్ వాదించారు. ఈ క్రమంలోనే ఆయన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది ఎన్నికల ఖర్చు పత్రాలను పొన్నం కోరడంలో తప్పులేదని పేర్కొంది. పొన్నం ప్రభాకర్ మధ్యంతర పిటిషన్ అనుమతి ఇస్తూ .. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

HC Hearing Sanjay Petition on Gangula Election : మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. గంగుల ఎన్నిక చెల్లదంటూ బండి సంజయ్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నేటి విచారణకు బండి సంజయ్ న్యాయస్థానానికి వచ్చారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి: Telangana High Court : తొలి తెలుగు తీర్పుతో.. హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ హైకోర్టు

'ఏడాది అంగన్​వాడీలో పనిచేయండి'.. హైకోర్టు భిన్నమైన తీర్పు.. 2 ఏళ్ల శిక్ష 3 రోజులకు కుదింపు

Last Updated :Jul 10, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.