ETV Bharat / sports

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన క్లోహీ​.. బవుమాతో గొడవ

author img

By

Published : Jan 19, 2022, 8:45 PM IST

Virat Kohli New Record: టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. వన్డేల్లో మరో ఘనత సాధించాడు. వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఘనత సాధించాడు.

Virat Kohli New Record: భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ మార్కు అందుకున్నాడు. అంతకుముందు సచిన్​ తెందుల్కర్(5065) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ​

ఎంఎస్ ధోనీ(4520), రాహుల్​ ద్రావిడ్​(3998), సౌరభ్​ గంగోలి(3468) సచిన్​ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీతో బవుమా గొడవ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్​ 36వ ఓవర్​ నాలుగో బంతిని కెప్టన్​ బవుమా షార్ట్​ కవర్​ రీజియన్​ దిశగా ఆడాడు. అది నేరుగా కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. అయితే కోహ్లీ బంతిని పంత్​కు బలంగా విసిరాడు. అది పొరపాటున బవుమాకు తగిలింది.

దీంతో బవుమా కోహ్లీపై కోపంగా చూస్తూ.."నేను క్రీజులోనే ఉన్నా. అలాంటి త్రోలు వేయనవసరం లేదు" అని అన్నాడు. కోపం పట్టలేని కోహ్లీ .."నేనేం కావాలని నిన్ను కొట్టలేదు. వికెట్​ కీపర్​కు త్రో విసిరే క్రమంలో పొరపాటున తగిలింది. ఒక బ్యాటర్​గా నువ్వు అర్థం చేసుకోవాలి " అని దీటుగా బదులిచ్చాడు.

ఇదీ చూడండి: ఐసీసీ టీ20 జట్టులో భారత క్రికెటర్లకు దక్కని చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.