ETV Bharat / sports

ఐసీసీ టీ20 జట్టులో భారత క్రికెటర్లకు దక్కని చోటు

author img

By

Published : Jan 19, 2022, 7:55 PM IST

ICC Team of 2021: ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 జట్టులో భారతకు భంగపాటు జరిగింది. ఒక్క భారత ఆటగాడి కూడా ఆ జట్టులో చోటుదక్కలేదు. అయితే పాక్​ నుంచి కెప్టెన్​ బాబర్ ఆజమ్​ సహా ముగ్గురికి చోటు లభించింది. ఆ జట్టుకు బాబర్​ ఆజమ్​నే కెప్టెన్​గా ఎంపిక చేసింది. కాగా ఐసీసీ టీ20 మహిళ జట్టుకు భారత్​ నుంచి స్మృతి మంధాన ఎంపికైంది.

ICC Team of 2021
ICC Team of 2021

ICC Team of 2021: ఐసీసీ 2021 ఏడాదికి అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్​కు కూడా చోటు దగ్గలేదు. దీంతో ఘోర అవమానం జరిగినట్లు అయింది. టీ20 ప్రపంచకప్​ 2021లో గ్రూపు దశలోనే నిష్క్రమించిన టీమ్​ఇండియా.. గతేడాది పొట్టి ఫార్మాట్​లో పెద్దగా రాణించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కాగా ఐసీసీ టీ20 టీమ్​ ఆఫ్​ ద ఇయర్​లో ముగ్గురు పాక్​ ఆటగాళ్లకు చోటు లభించడం విశేషం. అంతేకాకుండా పాక్​ కెప్టెన్​ బాబర్​ ఆజమ్​ను ఐసీసీ కెప్టెన్​గా ఎంచుకుంది. బాబర్​తో పాటు గతేడాది టీ20ల్లో రాణించిన పాక్​ వికెట్​ కీపర్​ మహ్మద్​ రిజ్వాన్​, పేసర్​ షాహిన్​ ఆఫ్రిదిలకు ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్టుల నుంచి ఇద్దరు చొప్పున ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది.

ఐసీసీ టీ20 టీమ్​

జోస్​ బట్లర్​, హమ్మద్ రిజ్వాన్​, బాబర్​, మార్క్రమ్​(దక్షిణాఫ్రికా), మిచెల్​ మార్ష్​(ఆస్ట్రేలియా), డేవిడ్​ మిల్లర్​(దక్షిణాఫ్రికా), వనిందు హసరంగ(శ్రీలంక), తబ్రేజ్​ షంషి(దక్షిణాఫ్రికా), జోష్​ హేజిల్​వుడ్​(ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్​ రెహ్మాన్​(బంగ్లాదేశ్​), షాహీన్​ అఫ్రిది(పాకిస్థాన్​)లు ఐసీసీ ఎంచుకుంది. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో ప్రదర్శన ఆధారంగానే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఐసీసీ టీ20 జట్టులో స్మృతి మంధాన

ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ మహిళ టీ20 జట్టులో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చోటు దక్కింది. గతేడాది పొట్టి ఫార్మాట్​లో 225 పరుగులు చేసి.. 31.87 సగటుతో రాణించడంతో మంధానకు ఆ జట్టులో స్థానం లభించింది.

ఇదీ చూడండి: Maxwell Record: మ్యాక్స్​వెల్​ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.