ETV Bharat / sports

T20 World cup: జట్టులో 15 మందికి మాత్రమే.. కానీ!

author img

By

Published : Aug 13, 2021, 10:30 PM IST

T20 World cup
టీ-20 ప్రపంచకప్​

టీ-20 ప్రపంచకప్​ కోసం ఒక్కో జట్టు నుంచి 15 మంది ప్లేయర్లు, 8 మంది అధికారులకు మాత్రమే ఐసీసీ అనుమతి కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరైనా కరోనా బారినపడితే అదనపు ప్లేయర్లు కావాలి కదా. ఎలా అంటారా? దానికి ఓ షరతు విధించింది. అదేంటంటే?

యూఏఈ వేదికగా త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్​నకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అధికారి. ఒక్కో దేశం నుంచి 15 మంది ప్లేయర్లకు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) అనుమతి కల్పించనున్నట్లు పేర్కొన్నాడు. వీరితో పాటు మరో 8 మంది అధికారులకు అవకాశం ఉందని తెలిపాడు.

సెప్టెంబర్​ 10లోపు.. ప్రపంచకప్​లో పాల్గొనే ప్రతి జట్టూ 23 మంది సభ్యుల (కోచ్​లు, సహాయక సిబ్బందితో కలిపి) వివరాలను సమర్పించాలని ఐసీసీ చెప్పినట్లు తెలిపాడు. కరోనా పరిస్థితి, బయోబబుల్​ నేపథ్యంలో.. అదనపు ప్లేయర్లను కూడా ఐసీసీ అనుమతిస్తుందని, కానీ ఆ ఖర్చులు సంబంధిత క్రికెట్​ బోర్డులే భరించాల్సి ఉంటుందని వివరించాడు.

''ఐసీసీ 15 మంది ప్లేయర్లు, 8 మంది అధికారుల ఖర్చులను మాత్రమే భరిస్తుంది. అదనపు ప్లేయర్లు, సిబ్బంది కావాలనుకుంటే.. ఆ ఖర్చులను సంబంధిత బోర్డులే చూసుకోవాలి.''

- ఐసీసీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అధికారి

ఈ ఏడాది అక్టోబర్ 17- నవంబర్​ 14 మధ్య టీ-20 ప్రపంచకప్​ జరగనుంది. యూఏఈ, ఒమన్​ వేదికలు. 2016 తర్వాత టీ-20 వరల్డ్​ కప్​ నిర్వహించడం ఇదే తొలిసారి.

ఈ ప్రపంచకప్​ భారత్​లో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వేదికను యూఏఈకి తరలించింది ఐసీసీ.

ఇదీ చూడండి: మంజ్రేకర్​ మాటల వల్లనే రోహిత్​ ఔటయ్యాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.