ETV Bharat / sports

మంజ్రేకర్​ మాటల వల్లనే రోహిత్​ ఔటయ్యాడా?

author img

By

Published : Aug 13, 2021, 9:41 AM IST

Updated : Aug 13, 2021, 9:54 AM IST

Twitter accuses Sanjay Manjrekar of commentator's curse after Rohit Sharma misses out on a century
మంజ్రేకర్​ వల్ల సెంచరీ చేయకుండానే వెనుదిరిగిన రోహిత్​!

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ సంజయ్​ మంజ్రేకర్​పై రోహిత్​ శర్మ ఫ్యాన్స్​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో వ్యాఖ్యాతగా మంజ్రేకర్ చేసిన కామెంట్స్​ వల్లే హిట్​మ్యాన్​ వెనుదిరిగాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే రోహిత్​ శర్మ ఔట్​ అవ్వడానికి.. మైదానం బయట ఉన్న మంజ్రేకర్​కు ఏం సంబంధం అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి. ​ ​

క్రికెట్​ వ్యాఖ్యాత, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ సంజయ్​ మంజ్రేకర్​పై రోహిత్​ శర్మ ఫ్యాన్స్​ సోషల్ ​మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో రోహిత్​ శర్మ బ్యాటింగ్​ చేసే క్రమంలో వ్యాఖ్యాతగా మంజ్రేకర్​ చేసి పని ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆ సమయంలో మంజ్రేకర్​ చేసిన పనికి టీమ్ఇండియా​ ఫ్యాన్స్​ గుర్రుగా ఉన్నారు.

ఏం జరిగిందంటే?

ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ రోహిత్​ శర్మ 83 పరుగులతో అద్భుతంగా రాణించాడు. లార్డ్స్​లో రోహిత్​కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అర్ధశతకం చేసేంత వరకు ఆచితూచి బ్యాటింగ్​ చేసిన ఈ భారత ఓపెనర్.. హాఫ్​సెంచరీ తర్వాత ఒక్కసారిగా జోరు పెంచేశాడు. ఈ క్రమంలోనే హిట్​మ్యాన్ సెంచరీ కోసం భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రోహిత్​ 81 పరుగుల వద్ద ఉన్న సమయంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజయ్​ మంజ్రేకర్​.. అతడిపై ప్రశంసలు కురిపించాడు. హిట్​మ్యాన్​ కచ్చితంగా శతకం సాధిస్తాడని మంజ్రేకర్​ కామెంట్​ చేసిన మరుక్షణమే.. జేమ్స్​ అండర్సన్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు రోహిత్. అప్పటివరకు రోహిత్​ సెంచరీ చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో మంజ్రేకర్​ శాపం వల్లనే రోహిత్​ ఔట్​ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఘనమైన ఆరంభం..

ఆతిథ్య జట్టు బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో టెస్టును ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (127 బ్యాటింగ్‌; 248 బంతుల్లో 12×4, 1×6), రోహిత్‌ శర్మ (83; 145 బంతుల్లో 11×4, 1×6) గొప్పగా బ్యాటింగ్‌ చేయడం వల్ల మొదటి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. చక్కగా బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ కోహ్లీ (42; 103 బంతుల్లో 3×4) దురదృష్టవశాత్తు ఆఖర్లో ఔటయ్యాడు. రాహుల్‌తో పాటు రహానె (1) క్రీజులో ఉన్నాడు. రెండు రోజూ మెరుగైన బ్యాటింగ్‌ను కొనసాగిస్తే మ్యాచ్‌లో భారత్‌కు ఇక తిరుగుండదు.

ఇదీ చూడండి.. ఇంగ్లాండ్​లో కోహ్లీ​ వైఫల్యానికి అదే కారణమా?

Last Updated :Aug 13, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.