ETV Bharat / sports

నాలుగేళ్ల తర్వాత ఐర్లాండ్ టూర్​కు టీమ్​ఇండియా- రోహిత్, కోహ్లీ  దూరం!

author img

By

Published : Mar 2, 2022, 12:52 PM IST

IND VS IRE: ఐర్లాండ్​ పర్యటనకు టీమ్​ఇండియా షెడ్యూల్​ ఖరారైంది. ఈ ఏడాది జూన్​ 26, 28 తేదీల్లో రెండు టీ20లు ఆడనుంది. అయితే ఈ సిరీస్​కు కెప్టెన్​ రోహిత్​ శర్మతో సహ పలువురు ఆటగాళ్లు దూరం అవుతున్నట్టు తెలుస్తోంది.

bharat
indian cricket team

IND VS IRE: భారత క్రికెట్​ జట్టు ఐర్లాండ్​ పర్యటన ఖరారైంది. ఆతిథ్య జట్టుతో రెండు టీ20లు ఆడనుంది టీమ్​ఇండియా. మలహైడ్​ వేదికగా ఈ ఏడాది జూన్​ 26, 28 తేదీల్లో ఈ సిరీస్​ జరగనుంది. ఈ విషయాన్ని క్రికెట్​ ఐర్లాండ్​ వెల్లడించింది.

ఈ సిరీస్​కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, పంత్‌, పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇంగ్లండ్‌ పర్యటనలో మిగిలిన ఒక టెస్టు కూడా ఈ ఏడాది జులైలో జరగనుంది.

భారత్​ జట్టు చివరిసారిగా 2018లో ఐర్లాండ్​లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా రెండు టీ20ల సిరీస్​ను 2-0 తో కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: Virat Kohli: 'కోహ్లీ వందో టెస్టు.. ఈసారి సెంచరీ పక్కా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.