ETV Bharat / sports

ఇటు ఎన్నికలు.. అటు పొట్టి కప్.. బీసీసీఐకి సవాలుగా 2024 ఐపీఎల్ నిర్వహణ!

author img

By

Published : Aug 1, 2023, 10:43 PM IST

2024 ఐపీఎల్ నిర్వహణలో అటు టీ20 ప్రపంచకప్​, ఇటు లోక్​సభ ఎన్నికలు ఉండటం బీసీసీఐకి సవాలుగా మారింది. మరి ఈ విషయంపై బోర్డు ఏ విధంగా ముందుకెళ్లనుందంటే...

2024 IPL Venues
2024ఐపీఎల్ నిర్వహణ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ భారత్​లో జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు 2024 టీ20 వరల్డ్ కప్​ షెడ్యూల్, మరోవైపు 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో.. ఐపీఎల్​ను భారత్​లో నిర్వహించడం బీసీసీఐకి సమస్యగా మారిందనే చెప్పవచ్చు. మరి రానున్న ఐపీఎల్​ సీజన్​ను భారత్​లో నిర్వహించడానికి వీలు కాకపోతే.. బీసీసీఐ ప్లాన్ ఎలా ఉండనుందంటే..

ప్రతి ఏడాది ఐపీఎల్​ మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమౌతుంది. దాదాపు 50 -60 రోజులపాటు క్రికెట్​ ప్రియుల్ని అలరించి.. మే చివరి వారంలో ముగుస్తుంది. అయితే జూన్ 4 నుంచి 2024 టీ20 ప్రపంచకప్ జరగనున్నందున.. ఐపీఎల్​పై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. మినీ వరల్డ్ కప్​ సన్నద్ధతకు ఆయా దేశాల ఆటగాళ్లు, లీగ్​లో మొత్తం మ్యాచ్​లు ఆడకుండానే వారి స్వదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అలాగే మన ప్లేయర్లకూ ప్రాక్టీస్​ చేయడానికి ఉండే సమయం కూడా తక్కువే..

కాగా ఓ దశాబ్ద కాలం నుంచి భారత్ ఐసీసీ టోర్నమెంట్​లలో ఛాంపియన్​గా నిలవలేదు. దీనికి ఐపీఎల్​ కూడా ఓ కారణమని ఇప్పటికీ.. పలువురు క్రీడా విశ్లేషకుల నుంచి బీసీసీఐ విమర్శలు ఎదుర్కొంటుంది. అందుకని 2024 ఐపీఎల్​ను ముందుగానే ప్రారంభిద్దామంటే.. టీమ్ఇండియా.. స్వదేశంలో మార్చి 11 వరకూ ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడాల్సి ఉంది.

2024 ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు చేయడం.. బీసీసీఐకి ఓ సమస్య అయితే.. రానున్న వేసవిలోనే భారత పార్లమెంట్​కు ఎన్నికలు జరగనుండటం మరో సవాల్​గా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్​ నిర్వహించే ప్రధాన నగరాలలో మ్యాచ్​లకు అనుమతులు లభించడం చాలా కష్టం. భద్రత కారణాల దృశ్య.. భారత్​లో ఐపీఎల్ టోర్నీ నిర్వహించడం పెద్ద సవాలే.

గతంలో యూఏఈ వేదికగా..
2014 సంవత్సరం లోక్​సభ ఎన్నికల కారణంగా.. ఐపీఎల్ దుబాయ్​లో నిర్వహించింది బీసీసీఐ. సీజన్​ మొదటి 20 మ్యాచ్​లకు అబుదాబి, షార్జా మైదానాలు వేదికలయ్యాయి. భారత్​లో ఎన్నికలు ముగిసిన తర్వాత.. మిగత మ్యాచ్​లను బీసీసీఐ స్వదేశంలోనే నిర్వహించింది. అయితే ఈ 2024లో కూడా ఇదే విధానాన్ని బీసీసీఐ అనుసరించనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ, శ్రీలంక రెండింట్లో ఏదో ఒక దేశాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం.

అయితే ఈసారి లీగ్​ను 45 రోజుల్లో ముగించాలని బీసీసీఐ భావిస్తుందట. వీకెండ్​తో పాటు వీక్ డేస్​లో కూడా రెండేసి మ్యాచ్​లు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ప్రస్తుతం బీసీసీఐ దృష్టి రానున్న వన్డే ప్రపంచకప్​ పైనే ఉందని బోర్డు మెంబర్ ఒకరు తెలిపారు. 2024 ఐపీఎల్​ గురించి వరల్డ్ కప్ ముగిసిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. కాగా డిసెంబర్​లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.