ETV Bharat / sports

ఐదో టెస్టు రద్దు.. విమర్శలపై దాదా కౌంటర్​!

author img

By

Published : Sep 13, 2021, 12:38 PM IST

Updated : Sep 13, 2021, 1:58 PM IST

ఇంగ్లాండ్​తో(ind vs eng) జరగాల్సిన ఐదో టెస్టు రద్దుపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఎందుకు క్యాన్సిల్​ చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.

dada
దాదా

ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఐదో టెస్టు(fifth test india vs england) రద్దుపై విమర్శించిన వారికి గట్టి​ సమాధానమిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఐపీఎల్​ కోసమే ఈ మ్యాచ్​ను క్యాన్సిల్​ చేశారంటూ ఆరోపణలు చేయడం సరికాదని అన్నాడు. ఆటగాళ్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

"ఆటగాళ్లు ఆడటానికి తిరస్కరించారు. అలా అని వారిని నిందించడం సరికాదు. ఫిజియో యోగేశ్​ ఆటగాళ్లతో బాగా సన్నిహితంగా ఉంటాడు. వారికి ప్రతిరోజు మసాజ్​ చేస్తాడు. అతడికి కరోనా సోకిందని తెలియగానే ఆటగాళ్లు భయపడ్డారు. అందుకే ఆడనన్నారు. బీసీసీఐ బాధ్యతారహితంగా వ్యవహరించదు. మిగతా బోర్డులను గౌరవిస్తుంది. వచ్చే ఏడాది ఈ మ్యాచ్​ను సింగిల్ మ్యాచ్ సిరీస్​గా నిర్వహిస్తాం."

-గంగూలీ, బీసీసీఐ అధ్యుక్షుడు.

కరోనా కారణంగా ఇంగ్లాండ్​ టీమ్​ఇండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దు అయింది. అయితే ఐపీఎల్​ కోసమే దీన్ని క్యాన్సిల్​ చేశారంటూ ప్రత్యర్థి జట్టుకు చెందిన మాజీ ఆటగాళ్లు విమర్శించారు. ఆటగాళ్లు వైరస్​ బారిన పడితే ఐపీఎల్​ రెండో దశ సుజావుగా సాగదనే నేపథ్యంలో భారత ప్లేయర్స్​ తప్పుకొన్నారని ఆరోపించారు.

రికార్డు దూరం

ప్రస్తుతానికి ఈ సిరీస్ ముగిసిందని గంగూలీ తెలిపాడు. దీంతో చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో గెలిచి రికార్డు సృష్టించాలనుకున్న కోహ్లీసేన ఆశ నెరవేరలేదు. చివరగా 1971లో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్ గెలిచింది టీమ్ఇండియా.

ఇదీ చూడండి: ఆ ఫలితం తర్వాతే స్వదేశానికి రవిశాస్త్రి

Last Updated :Sep 13, 2021, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.