ETV Bharat / sports

హెచ్​సీఏలో వివాదాలు- అయినా సెమీస్​లో హైదరాబాద్

author img

By

Published : Nov 19, 2021, 1:48 PM IST

Updated : Nov 19, 2021, 2:21 PM IST

సయ్యద్​ ముస్తాక్ అలీ ట్రోఫీలో(syed mushtaq ali trophy) హైదరాబాద్​ జట్టు వరుసగా విజయాలతో ముందంజలో నిలుస్తోంది. శనివారం సెమీస్​లో తమిళనాడు జట్టుతో(HYD vs TN semi final) తలపడనుంది.

HCA
హైదరాబాద్ జట్టు

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్​ అలీలో(syed mushtaq ali trophy) హైదరాబాద్​ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆరు జట్లపై విజయం సాధించి సెమీస్​కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ తమిళనాడుతో(HYD vs TN semi final) తలపడేందుకు సన్నద్ధమవుతోంది. శనివారం(నవంబర్ 20) ఇరుజట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది.

ముస్తాక్ అలీ టోర్నీలో రెండుసార్లు ఫైనల్​ చేరిన తమిళనాడు.. మరోసారి తుదిపోరుకు చేరేందుకు ప్రయత్నిస్తోంది. 2019లో కర్ణాటకతో ఫైనల్​ మ్యాచ్​లో తడబడిన తమిళనాడు.. 2020-21 సీజన్​లో అద్భుత ప్రదర్శనతో కప్పు సొంతం చేసుకుంది.

సమష్టిగా తమిళ జట్టు ఆటగాళ్లు..

జగదీశన్, సీ హరి నిశాంత్, బీ సాయి సుదర్శన్ కెప్టెన్ విజయ్ శంకర్​తో తమిళనాడు బ్యాటింగ్​ లైనప్ దృఢంగా ఉంది. తమిళ జట్టు బ్యాటర్లు ఈ టోర్నీలో మూడు అర్థశతకాలే నమోదు చేశారు. అయినప్పటికీ ప్రతి ఆటగాడి మేటి ప్రదర్శన చేయడం వల్ల ఆ జట్టు గెలుపు దిశగా అడుగులేసింది. ఆర్​ సంజయ్ యాదవ్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతుండగా, స్పిన్నర్లు ఆర్ సాయి కిశోర్, మురుగన్ అశ్విన్ జట్టుగా బలంగా మారారు.

అగర్వాల్, తిలక్ మెరుపులు..

హైదరాబాద్ జట్టు సారథి తన్మయ్ అగర్వాల్(333 పరుగులు ఆరు మ్యాచ్​ల్లో), బ్యాటర్ తిలక్ వర్మ(207 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్​తో రాణిస్తారు. బౌలింగ్​లో ఛామా మిలింద్ 18 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు జట్టు జోరును కట్టడిచేసేందుకు హైదరాబాద్ జట్టు ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.

సమస్యలను దిగమింగి..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(hyderabad cricket association) వివాదం ముదురుతోంది. హెచ్​సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ డిక్టేటర్​లా వ్యవహరిస్తున్నాడని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు విమర్శలు గుప్పించారు. అంబుడ్స్​మన్​గా జస్టిస్ దీపక్​వర్మను తాము వ్యతిరేకించినందుకు తమపై ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పనితీరుపై (HCA affairs) సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ వర్మ నియామకానికి సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని హెచ్చరించింది.

ఈ వివాదాల నేపథ్యంలో కూడా హైదరాబాద్​ జట్టు ముస్తాక్​ అలీ ట్రోఫీలో రాణిస్తుండటం విశేషం.

శనివారం జరిగే మరో సెమీఫైనల్స్‌లో విదర్భతో కర్ణాటక తలపడనుంది. క్వార్టర్స్‌లో కేరళపై తమిళనాడు విజయం సాధించగా.. రాజస్థాన్‌ను విదర్భ ఓడించింది. కర్ణాటక.. బంగాల్‌పై సూపర్‌ విజయం సొంతం చేసుకుంది.

ఇదీ చదవండి:

HCA: 'హెచ్​సీఏలో చిల్లర గొడవలు పోవాలంటే ఎన్నికలు పెట్టాల్సిందే'

HCA News: అజారుద్దీన్​కు సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Last Updated :Nov 19, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.