ETV Bharat / sitara

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్

author img

By

Published : Oct 25, 2021, 12:54 PM IST

Updated : Oct 25, 2021, 2:04 PM IST

స్టార్ హీరో రజనీకాంత్​.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఈ అవార్డును సూపర్​స్టార్​కు అందజేశారు.

Rajinikanth
సూపర్​స్టార్ రజనీకాంత్

దిగ్గజ సినీ నటుడు, తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్.. ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు.

రజనీకాంత్​ను 2019 ఏడాదికిగానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మార్చిలోనే ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రచయితగా సినీరంగానికి రజనీకాంత్ చేసిన విశిష్ఠ సేవలకుగానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు రజనీకాంత్ చేస్తున్న సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనను ఈ పురస్కారంతో గౌరవించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు. ఒకే ఏడాదిలో రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుశ్.. అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: అట్టహాసంగా జాతీయ అవార్డులు ప్రదానం

Last Updated :Oct 25, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.