ETV Bharat / sitara

'కేజీఎఫ్' దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్!

author img

By

Published : May 20, 2020, 5:22 PM IST

'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్​తో ఓ సినిమా చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఈ చిత్రం తర్వాత మూవీపై కూడా ఈరోజు క్లారిటీ వచ్చినట్లయింది. తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ట్వీట్ చేశారు. దీనిని బట్టి వీరిద్దరి కాంబినేషన్​లో ఓ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

జూనియర్
జూనియర్

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్​.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్​ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్​తోనూ ఓ సినిమా చేయబోతున్నారు. అయితే తారక్ పుట్టినరోజు సందర్భంగా మరో చిత్రంపైనా క్లారిటీ వచ్చినట్లయింది.

'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో ఎన్టీఆర్ ఓ​ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నీల్‌, తారక్‌కు కథ కూడా వినిపించేశాడని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే ప్రశాంత్​కు అడ్వాన్స్​ కూడా ఇచ్చేసిందట. ఈ వార్తలన్నింటికీ బలం చేకూరుస్తూ ఈరోజు యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ విషెష్ తెలిపారు. అందులోని సారాంశం ప్రకారం వీరిద్దరి మధ్య సినిమా ఫిక్స్​ అయినట్లు తెలుస్తోంది.

"న్యూక్లియర్‌ ప్లాంట్‌ పక్కన కూర్చుంటే ఆ ఫీల్‌ ఎలా ఉంటుందో ఫైనల్​గా నాకు తెలిసింది. నీ చుట్టూ ఉండే క్రేజీ ఎనర్జీకి మళ్లీ వచ్చినపుడు నా రేడియేషన్‌ సూట్‌ తీసుకువస్తా. త్వరలోనే కలుద్దాం. హ్యాపీ బర్త్​డే బ్రదర్​" అంటూ ట్వీట్ చేశాడు ప్రశాంత్.

  • So….finally I know how it feels like to sit next to a nuclear plant….next time bringing my radiation suit to be around all that crazy energy @tarak9999
    Happy birthday brother!!!
    Have a safe and great day
    See you soon...#HappyBirthdayNtr#stayhomestaysafe

    — Prashanth Neel (@prashanth_neel) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.