ETV Bharat / international

మోదీ పర్యటన సమాప్తం.. భారత్​కు తిరుగు పయనం

author img

By

Published : Nov 2, 2021, 11:51 PM IST

PM Modi tour update
మోదీ పర్యటన సమాప్తం

జీ20 సదస్సు, కాప్​26 ప్రపంచ వాతావరణ సదస్సు కోసం ఇటలీ, బ్రిటన్​లో పర్యటించిన ప్రధాని మోదీ.. తిరిగి భారత్​కు పయనమయ్యారు. ప్రవాస భారతీయులు గ్లాస్గోలో ఆయనకు వీడ్కోలు పలికారు.

ఐదు రోజులపాటు ఇటలీ, బ్రిటన్​లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం తిరిగి భారత్​కు పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన జీ20 సదస్సు, కాప్​26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు.

pm modi tour update
విమానం ఎక్కేముందు అభివాదం చేస్తున్న మోదీ

"భూమి భవిష్యత్తు గురించి రెండు రోజులపాటు జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత గ్లాస్గో నుంచి బయలుదేరాను. పారిస్​ ఒప్పందంలోనీ తీర్మానాలకు భారత్​ కట్టుబడి ఉండటమే గాకుండా.. రానున్న 50 ఏళ్ల కోసం ప్రతిష్ఠాత్మక ఎజెండాను ఏర్పాటు చేసుకుంది" అని మోదీ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

గ్లాస్గోలోని హోటల్​ నుంచి బయలుదేరే ముందు మోదీ.. అక్కడకు చేరుకున్న చిన్నారులతో ముచ్చటించారు. ప్రవాస భారతీయులతో కలిసి ఆయన సరదాగా డోలు మోగించారు. అనంతరం ఆయనకు వారు వీడ్కోలు పలికారు.

  • #WATCH PM Modi plays the drums along with members of the Indian community gathered to bid him goodbye before his departure for India from Glasgow, Scotland

    (Source: Doordarshan) pic.twitter.com/J1zyqnJzBW

    — ANI (@ANI) November 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
pm modi tour update
చిన్నారులతో ముచ్చటిస్తున్న మోదీ
pm modi tour update
ప్రవాస భారతీయులకు మోదీ అభివందనం
pm modi tour update
చిన్నారితో సరదాగా...

పర్యటనలో భాగంగా... వివిధ దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఇటలీలోని రోమ్ నగరంలో జీ20 సదస్సు జరగగా... స్కాట్లాండ్​లోని గ్లాస్గో వేదికగా కాప్​26 భేటీ జరిగింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.