ETV Bharat / entertainment

ఆ నటుడి కోసం స్వయంగా భారత్​కు వచ్చిన స్పిల్​బర్గ్.. కెరీర్​లో తొలిసారి అలా..

author img

By

Published : Jan 14, 2023, 6:31 PM IST

గాడ్ ఆఫ్ మూవీస్​గా పేరొందిన దర్శక ధీరుడు స్టీవెన్​ స్పిల్​బర్గ్​ తన కెరీర్​లో మొదటిసారి ఆడిషన్స్ కోసం ఓ యాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఆ యాక్టర్ భారతీయుడే కావడం విశేషం. ఆయన ఎవరో తెలుసా?

Steven Spielberg Amrish Puri audition
హాలీవుడ్ ప్రముఖ దర్శక ధీరుడు స్టీవెన్ స్పిల్​బర్గ్

హాలీవుడ్ దర్శక ధీరుడు స్టీవెన్ స్పిల్​బర్గ్​ను కలిసేందుకు చాలా మంది ఎదురుచూస్తారు. స్టీవెన్​ను గాడ్ ఆఫ్ మూవీస్​గా అభివర్ణిస్తారు. 'జురాసిక్ పార్క్​', 'హుక్', 'ది టర్మినల్', 'ది పోస్ట్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్​ ప్రదానోత్సవంలో స్టీవెన్​ను కలిసిన రాజమౌళి సైతం అమితానందం వ్యక్తం చేశారు. "నేను దేవుడుని ఇప్పుడే కలిశా" అని ట్వీట్ చేసి ఆయన వీరాభిమానాన్ని చాటుకున్నారు. అయితే అంతటి పేరున్న స్టీవెన్.. తన సినిమాలో ఓ నటుడిని తీసుకోవటం కోసం స్వయంగా భారత్​కు వచ్చారు. చిత్ర బృందంతో సహా ఇండియాకు వచ్చి ఆడిషన్స్ నిర్వహించారు. ఆ నటుడు మరెవరో కాదు... అనేక ప్రతినాయక చిత్రాలతో అలరించిన అమ్రీశ్ పురీ.

'ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్' చిత్రంలో మోలారామ్ అనే విలన్ పాత్ర కోసం మంచి నటుడిని వెతికేందుకు నానా ప్రయత్నాలు చేసింది స్టీవెన్ టీమ్. భారత్​కు చెందిన అమ్రీశ్​ పురీ గురించి తెలుసుకొని ఆడిషన్స్ కోసం ఇక్కడికి వచ్చింది. స్టీవెన్ సైతం చిత్రబృందంతో పాటు ముంబయికి వచ్చారు. అమ్రీశ్​కు ఆడిషన్ నిర్వహించి.. వెంటనే పాత్రకు ఎంపిక చేశారు. ఓ నటుడి కోసం స్వయంగా స్టీవెన్ ఓ దేశానికి వెళ్లి ఆడిషన్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ విషయాన్ని స్పిల్​బర్గ్ స్వయంగా ఓ లేఖలో రాశారు. 'అమ్రీశ్ పురీ ఎప్పటికీ ప్రపంచంలోనే గొప్ప విలన్​గా నిలిచిపోతారు. ఎవరూ దీన్ని మార్చలేరు. ఓ నటుడిని ఆడిషన్​ చేసేందుకు నేను వేరే దేశానికి వెళ్లడం ఆయన విషయంలోనే జరిగింది' అని చెప్పారు స్పిల్​బర్గ్. ఈ పాత్ర కోసం తనను సంప్రదించిన విషయంపై అమ్రీశ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.