ETV Bharat / crime

బాలికకు మాయమాటలు చెప్పి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

author img

By

Published : May 4, 2022, 2:43 PM IST

RAPE ON MINOR GIRL: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కీచకులు వావి వరసలు మరచి.. చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు లేదా మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నాారు. యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

RAPE ON MINOR GIRL
మైనర్​పై​ అత్యాచారం

RAPE ON MINOR GIRL: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై 24 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు ప్రైవేటు జాబ్​ చేస్తూ మాధవరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల ముంబయి నుంచి మాధవరంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలికను అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే కొద్ది రోజుల క్రితం ముంబయి వెళ్లిన బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చిందని చెప్పడంతో ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ముంబయిలో కేసు నమోదు చేశారు. అయితే ముంబయి పోలీసులు కేసును మంత్రాలయానికి బదిలీ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై మంత్రాలయం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Baby Boy Kidnap : తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న పసికందు కిడ్నాప్‌

మైనర్​పై​ అత్యాచారం.. పోలీసు స్టేషన్​ గదిలోకి తీసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.